‘తెలంగాణ రచయితల వేదిక’ (తెరవే) 5వ రాష్ట్ర మహాసభలు ములాఖాత్ పేరిట ఈ నెల 21వ తేదీన సుందరయ్య విజ్నాన కేంద్రం, హైదరాబాద్ లో జరుగుతాయి. ఉదయం 10 గంటలకు జెండా ఆవిష్కరణ జూకంటి జగన్నాథం చేస్తారు. చుక్కా రామయ్య గండదీపం వెలిగిస్తారు. అల్లం రాజయ్య ప్రారంభోపన్యాసం చేస్తారు. జూకంటి అధ్యక్షోపన్యాసం చేస్తారు. జూలూరు గౌరీ శంకర్ కార్యదర్శి నివేదిక చదువుతారు. ముఖ్య అతిథులుగా కె.శ్రీనివాస్, టంకశాల అశోక్, మల్లె పల్లి లక్ష్మయ్య, అల్లం నారాయణ పాల్గొంటారు. ‘సోయి’ ప్రత్యేక సంచికను నందిని సిధారెడ్డి ఆవిష్కరిస్తారు. చిన్న రాష్ట్రాల ఆవశ్యకత- తెలంగాణ, చత్తీస్గడ్ రాష్ట్ర పర్యటన-ఒక విశ్లేషణ, తెలంగాణ భాష- సంస్కృతి, స్థానికవాదం- సాంస్కృతిక, రాజకీయ చైతన్యం అంశాలపై ఉపన్యాసాలుంటాయి. వివిధ సెషన్లకు జింబో, దామెర రాములు, బన్న ఐలయ్య, వేణు సంకోజు అధ్యక్షత వహిస్తారు. వక్తలుగా ఇనుకొండ తిరిమలి, లోకేశ్వర్, నలిమెల భాస్కర్, సీతారాం పాల్గొంటారు. సాయంత్రం ఊరుడి మల్లికార్జున్ గొల్ల సుద్దులు, విమల బృందం పాటలు వినిపిస్తారు.
నిజమే. తెలంగాణ గుండె గాయపడింది. క్షతగాత్ర తెలంగాణ. మరోసారి నిలువునా మోసపోయిన తెలంగాణ. ఇంటి మనుషులు, పరాయి మనుషులతో రెండందాలా దగాపడింది తెలంగాణ. కకావికలై, ఛిద్రుపలైన గుండె గాయం పాతది. అది మాననిది. ఇప్పుడిక ఏలిక పూర్తి విద్వేషంతో, పూర్తి అసహనంతో, ఏమీ దాచుకోకుండానే ప్రకటించాడు.
కాంగ్రెస్ ప్రభుత్వం పునరాగమనంతో గోదావరి జలాల నియంత్రణ, వాటి ప్రైవేటీకరణ మరింత వేగవంతమవనున్నాయని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ, నిర్వాసితుల పునరావాసం, ప్రకృతిని మానవ అవసరాలకు అనుగుణంగా నియంత్రించడం, వాతావరణ మార్పులు మొదలైన అంశాలపై ముమ్మర చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశాలపై ఆయా దేశాల పాలకులు అనుసరిస్తున్న విధానాల పట్ల తీవ్ర నిరసన పెల్లుబుకుతోంది. అయినప్పటికీ మన రాష్ట్రంలో కాటన్ వారసత్వం నిరాటంకంగా కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
గ్లోబలైజేషన్.. నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు… ఇవన్నీ ప్రజలకు చెడు చేస్తున్నయని చెప్పుకు తిరిగే ఒక వర్గం తయారై ఉంది. గబుక్కున ఈ ఫలితాలన్ని అందుకునే వాళ్ళలో ఈ వర్గం ముందే ఉంటుంది. అన్ని అనుబవిస్తది. పొరపాటునో లేక వేరే కారణాలవల్లో ఏవో కొందరికి అలాంటి మంచి జరిగితేనో ఇది ఈ విధంగా జరగటానికి వీల్లేదు. ఇది మీకు చాలా చెడు చేస్తదని వాళ్ళున్న స్థితిని, స్థాయిని పట్టించుకోకుండా వీళ్లుచెప్పబోతుంటరు వాళ్లకు.
ఉద్యమాల పురుటిగడ్డ మీద కథాసాహిత్య ప్రక్రియను మరింత విస్తరించేందుకు తెలంగాణ నవ కథకుల ఆధ్వర్యంలో తెలంగాణ కథా వేదిక ‘దస్కత్’ ఆవిర్భవించింది. తెలంగాణ నేలమీద జరిగిన, జరుగుతున్న పోరాటాల్లో సాహిత్యం తనవంతు పాత్రను క్రియాశీలకంగా పోషించింది. అక్షరాలు దారి చూపే వెలుగు దీపాలైనయ్. ఈ క్రమంలో జీవితాన్ని సమగ్రంగా ప్రతిబింబించే కథా ప్రక్రియను మరింత విస్తరించాల్సిన అవసరాన్ని ఈ ప్రాంత నవతరం గుర్తించింది.
ఒకసారి నిజాం ప్రభువు నిర్మల్కు వచ్చినప్పుడు ఆయనకోసం అక్కడి కళాకారులు స్వాగత వేదికను ప్రత్యేకంగా అలంకరించారు. ఆయన సింహాసనం పైన వేలాడేలా బంగారు రంగులో తయారు చేసిన అరటి పువ్వును పెట్టారు. ప్రభువు ఆసీనుడు కాగానే అది విచ్చుకుని బంగారు రంగుల రేకులు జలజలా పడ్డాయి. దానికి ఎంతో సంతోషించిన నిజాం ఆ అలంకారాన్ని అంత సుందరంగా చేసిన సోమక్షత్రియులను తమ ఆస్థాన కళాకారులుగా నియమించుకున్నారు.
సుద్దాల హనుమంతు శత జయంతి సంవత్సరం సందర్భంగా ‘సుద్దాల జీవితం-సాహిత్యం’ అనే సంకలనం తీసుకువస్తున్నాం. ఆయన రచనలు- పాటలు, గొల్ల సుద్దులు, సాధు వేషాలు, పిట్టల దొర, ఫకీరు వేషం లాంటివి ఎవరివద్ద ఉన్నా మాకు పంపి సహకరించగలరు. ఆయనతో వ్యక్తిగత అనుభవాలు, అనుబంధాలు రాసి పంపగలరు. హైదరాబాద్లో జరిగే పుస్తకావిష్కరణ సభ వివరాలు తెలుపుతాము.
ఇంగ్లండ్లో తెలుగువారి అస్తిత్వానికి సాహిత్యరంగంలో ప్రతీకగా ఆవిర్భవించిన మాచెర్ల హేమ వరంగల్ జిల్లా ఆత్మకూర్ గ్రామానికి చెందినవారు. రిచర్డ్ అండ్ జూడీ అనే జంట నిర్వహించిన (2007) నవలల పోటీలో పాల్గొన్న 44,000 ఎంట్రీలలో వడపోయగా మిగిలిన 26 నవలలలో హేమ ‘బ్రీజ్ ఫ్రమ్ ది రివర్ మంజీర‘ ఒకటిగా నిలిచింది.
హైదరాబాద్ నగరానికి ఎన్నో ద్వారాలు వున్నాయి. నగరంలో ఎవరైనా అడుగు పెట్టాలంటే, ఆ ద్వారాలగుండానే లోపలికి అడుగుపెట్టాలి. చంపాద్వారం నుంచి యాకుబ్పురా ద్వారం దాటి ధర్మంవంత్ హైస్కూలు దాకా నేను రోజూ నడుచుకుంటూ వెళ్ళే వాణ్ణి. ఆరోజుల్లో రిక్షాలుగానీ, సైకిళ్ళు గానీ, బస్సులు గానీ చాలా తక్కువగా కనిపిస్తూవుండేవి. రోడ్ల మీద ఏనుగులూ, ఒంటెలూ, ఎద్దుల రథాలు వుండేవి. షకరాలూ, జట్కాలూ టాంగాలూ, గుర్రపుబగ్గీలూ దర్శనమిస్తూ వుండేవి. ఆ రోజుల్లో వీధి వీధినా వ్యాయామశాలలూ, కుస్తీపట్లునేర్పించే తాలింఖానాలు ఉంటూవుండేవి. తమ తమ వీధుల గౌరవమర్యాదల్ని కాపాడుకోవాలనే ఆత్రం వీధివాళ్లలో వుండేది.
అలనాడు సాహిత్యకారులను గౌరవించడం హైదరాబాద్ రాజ్యంలో ఒక సామాజిక విలువగా చెలామణి అయ్యేది. రాజులు, కులీనవర్గాలే కాదు సామాన్యులు కూడా కళాప్రియులు, కవిత్వ పిపాసులే. రాజులు సంగీత, సాహిత్యకారులు కావడం చరిత్రలో ఉన్నదే. ఆసఫ్ జాహీల వంశంలో ఐదుగురు రాజకవులు ఉర్దూ సాహిత్యంలో పేరెన్నికగనడం విశేషం…
అమ్మకు బహిరంగ లేఖ
అమ్మా!
బావున్నావే, మేమిద్దరం బాగున్నామే. ఇప్పుడు నువ్వు, నీ ఆలోచనలు మా ఇద్దరి మధ్య ఇద్దరి కోడళ్ల మధ్యే కాదు మొత్తం మన పార్టీ కామ్రేడ్స్ మద్యా చర్చనీయాంశమే అమ్మా! మన కామ్రేడ్స్ అందరికీ అమ్మవే నీవిపుడు. నీ గుండె ధైర్యం, మనసులోని మంచితనం మాకెప్పుడూ ఆదర్శమే కాదు అనుసరణీయమే. మేం ఇల్లు విడిచిన నాటి నీ రూపు, బాపు రూపు తప్ప మరో మారు చూసి ఎరగం కదే.
1969 తెలంగాణ ప్రజా ఉద్యమానికి ఇప్పుడు 40 ఏళ్ళు, అయినా ప్రజల కోరిక ‘తెలంగాణ’ ఇంకా ఒక చేదు కల లెక్కనే మిగిలి ఉన్నది. 1969 తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని గుర్తు చేసుకుంట ‘తెలంగాణ హిస్టరీ సొసయిటీ’, “1969 తెలంగాణ ఉద్యమ కరపత్రాలు” అనే శీర్షికతోటి ఒక పుస్తకం తీసుక రానీకి ప్రయత్నం చేస్తుంది.
“మరో ప్రపంచం
మరో ప్రపంచం
మరో ప్రపంచం పిలిచిందీ…”
టీవీలో శ్రీశ్రీ పాట. స్టూడెంట్స్ క్యాంటీన్ అంతా వినబడుతోంది. వేడి వేడి చాయ్ తాగుతూ టీవీలో లీనమైపోయా.
మధ్యలో తల పక్కకు తిప్పి చూసిన.
ప్రతి మనిషికీ సామాజిక జీవితం ఉంటుంది. సామాజిక జీవితం ఎంతమాత్రమూ లేని, ఒంటరి ద్వీపంలాగ బతికే మనిషిని ఊహించడమే అసాధ్యం. మనిషి సంఘజీవి అనేది శుష్కమైన పదబంధం కాదు. సంఘం లేకుండా, తోటి మనుషులు లేకుండా, మానవ సంబంధాలు లేకుండా మనిషి జీవించడమే అసాధ్యం. ఓడ పగిలిపోయి, మహాసముద్రం మధ్య ఒక ద్వీపం మీద ఒంటరిగా మిగిలిన కథానాయకుడు రాబిన్సన్ క్రూసో సంఘంతో సంబంధంలేకుండా తన ఉత్పత్తి తానే చేసుకున్నట్టు రాయదలచిన నవలాకారుడు డేనియల్ డిఫో కూడ చివరికి ఒక్కమనిషి సహాయమైనా క్రూసోకు ఉండడం అవసరమని అర్థమయి, మాన్ ఫ్రైడేను సృష్టించాడు.
ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఇక్కడ జరిగే ఎన్నికల్లో ప్రతిసారి విదేశాలలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రవాస భారతీయులు ఒకింత నిరాశకు గురికావడం ఒక అనవాయితీగా మారింది. దేశ దశ, దిశ నిర్దేశించే ఏ ఎన్నికల్లోనూ వీరికి ఓటు హక్కు లేకపోవడం ఇందుకు కారణం. అమెరికా, బ్రిటన్, రష్యాలతో పాటు ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా తదితర దేశాలకు చెందిన వారు విదేశాలలో నివసిస్తూ తమ దేశాల రాయబార కార్యాలయాలలో ఏర్పాటు చేసే పోలింగ్ బూత్లలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాంటి అవకాశం మన ప్రవాసీయులకు లేకపోవడం బా«ధాకరం.
All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.
If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com