Feed on
Posts
Comments

15

1969 జూన్‌ 27న ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తన పదవికి రాజీనామ చేసినాడు. ఆ రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్‌కు పంపకుండ ఢిల్లీలోని కాంగ్రెస్‌ అధ్యక్షుడు నిజలింగప్పకు పంపినాడు. అదీ ఆయన కుటిల నీతి.

ఆరు నెలల సుదీర్ఘ తెలంగాణా ఉద్యమ పోరాట ఫలితమే ముఖ్యమంత్రి రాజీనామా. ఇది తెలంగాణ ప్రజల నైతిక విజయం.

Continue Reading »

Share/Save/Bookmark

14

ఏ బొంబై కా తమాషా దేఖో
ఏ చార్‌ దిన్‌కా తమాషా దేఖో
ఏ కల్‌కత్తా కాళీ మాతా దేఖో
ఏ బెజ్వాడా కనకదుర్గా దేఖో
ఏ చారానా తమాషా దేఖో
ఏ బార్‌ బార్‌ తమాషా దేఖో
ఏ బొంబై కా తమాషా దేఖో

స్వామి తన మిత్రబృందంతోటి ఆ బొంబై కా తమాషా ముందు నిలబడి ఉన్నడు.

Continue Reading »

Share/Save/Bookmark

13

1969 జూన్‌ నెలను తెలుగు పంచాంగం ‘రక్తాక్షిమాసం’ అని పేర్కొంది. ఆ పేరుకు తగ్గట్టు నిజంగనే తెలంగాణాల ఆ నెల అంతా రక్తం ప్రవహించింది. ఆ రక్తాక్షి మాసమంత పోలీసుల కాల్పులతోటి, తెలంగాణా ప్రజల బలిదానాలతోటి దద్ధరిల్లిపోయింది. జూన్‌ రెండవ తేదీ సోమవారం నుండి నాలుగు రోజులు కొనసాగిన అల్లర్లు, మారణకాండల ప్రభుత్వ లెక్కల ప్రకారమే నగరంల 30 మందికి పైగా మరణించినారు. వందలాది మందికి గాయాలైనాయి. అండ్ల కొందరు శాశ్వతంగ అవిటివారైనారు. అనధికార లెక్కలు తెలుసుకుంటే గుండెలు బద్దలయితయి. ఎన్ని సార్లు కర్ఫ్యూ విధించినా పరిస్థితి అదుపులకు రానందున 33 గంటల పాటు నిరవధిక కర్ఫ్యూ విధించినారు. జనజీవనం స్తంభించిపోయింది. అనేక జీవితాలు అల్లకల్లోలాలయినై. కుటుంబాలు కూలిపోయినై.

Continue Reading »

Share/Save/Bookmark

12

అట్ల ఆ డిమాండ్స్‌ డే - మే డే ఒక బ్లాక్‌ డేగ నగర చరిత్రల నిలిచిపోయింది. తెల్లారి మే రెండున జంటనగరాలల్ల సంపూర్ణ హర్తాల్‌, బంద్‌ జరిగింది. ఆ రోజు కూడా మళ్లీ అల్లర్లు జరిగినై. ఆ రోజు రాత్రి సికింద్రాబాద్‌ల జేమ్స్‌ స్ట్రీట్‌ నుండి ఓల్డ్‌ ఘాస్‌మండీకి పోతున్న పోలీసు వ్యాన్‌ మీద ఇద్దరు యువకులు బాంబులు విసిరితే ఒక జవాను అక్కడికక్కడే మరణించినాడు. వ్యాన్‌ల ఉన్న మిగిలిన వారు గాయపడినారు. నరేందర్‌ అనే ఆవుల మందకు చెందిన పాల వ్యాపారి, మల్కాజిగిరికి చెందిన కుమార్‌ అనే ప్రింటింగు ప్రెస్‌ కార్మికుడు ఆ బాంబులు వేసినారు.

Continue Reading »

Share/Save/Bookmark

11

“ఈ చిలుక పలుకదేమీ మనతో
మాటాడదేమీ మనతో
నిన్న మొన్నటి దాకా ఈ చిలుక
మాటలాడెను బాగా”

అర్ధరాత్రి దాటింది. నట్టింట్ల జెఫ్రీ శవం. అనంతశయనం. అతి దీర్ఘమైన పెను నిద్దుర. పెను విశ్రాంతిలకు పోయిన జోసెఫ్‌ మార్క్వెజ్‌ జెఫ్రీ కండ్లు తెరుచుకునే ఉన్నయి - రాబోయే తెలంగాణా కోసం నిరీక్షిస్తున్నట్లు. ప్రాణం పోయిన కొద్దిసేపట్లనే కనురెప్పల్ని మూయాలంట. లేకపోతే కండ్లు అట్లనే తెరుచుకొని ఉంటవని ఎవరో ముసలమ్మ అంటుంది.

Continue Reading »

Share/Save/Bookmark

10

ఆ రోజు మేడే. చికాగో వీధులల్ల తమ హక్కుల కోసం కార్మికులు రక్తం ధారపోసిన రోజు. తమ రక్తవర్ణంతోటి అరుణపతాకాన్ని సృష్టించిన రోజు. ఆ రోజుననే హైద్రాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాలల్ల తెలంగాణా ప్రజా సమితి ‘డిమాండ్‌ డే’ కోసం పిలుపిచ్చిన రోజు. తెలంగాణా కోసం ఊరేగింపు జరుపవలసిన రోజు.

స్వామి ఇక్బాల్‌ హోటల్ల కూచున్నడు.

“బోలో సాబ్‌ క్యా హుకూం హై” సర్వర్‌ పలకరింపుకు ఉలికిపడి ఈ లోకంలకు వచ్చినాడు స్వామి.

నహారి, ఖుల్చా, పాయారోటీ, శీర్మాల్‌, బోటీ కబాబ్‌, ఖీమా, రుమాలి రోటీ… సర్వర్‌ దండకం చదవసాగినాడు. వాడి దాడి నుండి తప్పించుకోనీకి పాయారోటీకి ఆర్డరిచ్చి మళ్లీ తన మనోవల్మీకంలకు జారిపోయినాడు.

Continue Reading »

Share/Save/Bookmark

9

టాంగు టంగు, టాంగు టంగు - చిట్కుం చిట్కుం రకరకాల సమ్మెట పోట్లు. కర్వాయిలకు సర్వలను, చెంబులను దూర్చి సుత్తెతోటి మట్నగొట్టే చప్పుళ్లు. పొగరతోటి రంధ్రాలు చేస్తున్న ధ్వనులు. సుత్తి, డాకలి, కొరడు, రకరకాల పట్టకారుల సంగీత నాదాలు. సికింద్రాబాద్‌ కంచరి బస్తీల ఆ ‘బాడా’లో శ్రామిక జనజీవన సౌందర్య సంగీతం. శ్రమతో, అద్భుత కళానైపుణ్యంతోటి సృష్టించబడుతున్న గంగాళాలు, తాంభాళాలు, కొప్పెరలు, నీళ్లు కాగబెట్టుకునే బైలర్లు, బిందెలు, చెంబులు, తలెలు, పాన్‌దాన్‌లు - ఒగల్‌దాన్లు. అదొక ‘ఆర్టిసాన్స్‌’ కమ్యూన్‌లాగ కనబడుతుంది. నైజాం కాలంలనే బతుకు బాటను వెదుక్కుంట పల్లెల నుండి పట్నానికి వలస వచ్చిన వృత్తికళాకారులు వాళ్లు. స్వాముల వారి లింగోటం, పంతంగి, చండూరు, నారాయణపురం, దుబ్బాక, పెంబర్తి, సిద్ధిపేట, వరంగల్లు వాళ్ల మాతృస్థావరాలు.

Continue Reading »

Share/Save/Bookmark

8

స్వామి ఇంటికి చేరుకొనేసరికి ఇంట్ల ‘భూకంపం’ వచ్చినంత పరిస్థితిని గమనించాడు. క్రిందటి రాత్రి స్వామి ఇంటికి రాకపోయేసరికి ఇల్లంత అతలాకుతలం అయిపోయింది. పోలీసులు అరెస్టు చేసి జైల్ల పడేసినారేమో, కాకపోతే ఏదైనా టక్కర్‌ అయ్యి దెబ్బలు తగిలి దవాఖాన్ల పడిండేమో అని అమ్మ ఏడుపులు. అరుపులు. నెత్తి కొట్టుకొని క్రింద నేలపై పడిపోయింది. స్వామి గురించి భయమేందోగని బాపుకు అమ్మను సముదాయించడమే కష్టమైపోయింది. ‘నా కొడుకును సక్కగ ఇంటికి తీసుకు రాకపోతివో నీ ముందే నా ప్రాణమిస్త’ అని పెరుమాండ్ల పటాలు నిలబెట్టిన గద్దె ముందు తలకొట్టుకునేసరికి ఆమె నొసటికి దెబ్బ తగిలి బొడిపెలు వచ్చినై. ఆ తర్వాత శాంతించి తమ ఇలవేలుపు చిల్పూరుగుట్ట బుగులు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టింది.

Continue Reading »

Share/Save/Bookmark

పరిష్కారం ఏదైనా ప్రజలే గెలవాలి

రొమాంటిక్‌ రంగు పులమడం అర్థరహితం

సమస్య పట్ల అవగాహనా, భావోద్వేగాలకు లోనుగాకుండా తార్కికంగానూ దూరదృష్టితోనూ పరిష్కారం ఆలోచించగల వివేచనా కనిపించడం లేదు. ‘సమైక్యాంధ్ర’ బోలు నినాదం. ప్రత్యేక తెలంగాణ అంత తేలిగ్గా ఇవ్వరన్న నమ్మకంతో ఇన్నాళ్లూ అందుకు మద్దతు పలికిన రాజకీయ పార్టీలూ, ఉద్యమం జరుగుతున్నన్నాళ్లూ చోద్యం చూస్తూన్న ఇతర ప్రాంత ప్రజలూ ఇప్పుడు సమైక్యాంధ్ర అంటూ గొంతు చించుకోవడం విచిత్రం. Read Completely >>

Share/Save/Bookmark

7

ఆ రోజు పొద్దుపొద్దున్నే స్వామి ఇంకా నిద్ర లేవకముందే గోపి సైకిలేసుకుని, చెమటలు కారంగ, దమ్ములు పోసుకుంట శాలీబండాకు వచ్చినాడు. శాలీబండా చడావ్‌ మీద సైకిల్‌ తొక్కడమంటే మజాక్‌ కాదు. కాళ్ల పిక్కలల్ల మస్తుగ బలం ఉండాలె. శరీరానికి తాఖత్‌ గావాలె. కలేజాల ఖువ్వత్‌ ఉండాలె. అమ్మ వాడిని దివాన్‌ఖానాల ఉన్న ఆరామ్‌ కుర్చీల కూచుండబెట్టి కాశీ నుండి తెచ్చిన రాగిచెంబుల చల్లటి మంచి నీళ్లు, గుండ్రటి తెల్లటి కోపుల పొగలు గక్కే గరం గరం ఛా ఇచ్చింది. దివాన్‌ఖానా పక్కనే బాయి ఉంది. ఇనుప బొక్కెన చప్పుడు, దాని గొలుసు, గిరిక చేసే వింత వింత చప్పుళ్లతో గమ్మత్తు సంగీతాన్ని వింటూ వాడు ఛాను ఊదుకుంటూ, చప్పరిస్తూ గుటకలు మింగుతూ ఆనందిస్తున్నడు. బాయి గిరికకు నూనె పోయనట్టుంది. అది కీసుకీసుమని శబ్దం చేస్తుంది.

Continue Reading »

Share/Save/Bookmark

6

జనవరి ఇరవై నాలుగున సదాశివపేటల పోలీసులు కాల్పులు జరిపినారు. పద్నాలుగు మందికి దెబ్బలు తగిలినాయి. ఆ కాల్పులలో శంకర్‌ అనే పదిహేడు సంవత్సరాల యువకుడు మరణించినాడు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంల శంకర్‌ తొలి అమరవీరుడు. శంకర్‌ అంత్యక్రియలలో మూడు వేల మంది విద్యార్థులు పాల్గొన్నరు. మిగిలిన క్షతగాత్రులందరినీ సికింద్రాబాదులోని గాంధీ దవాఖానాకు తరలించినారు. అక్కడ వాళ్లు కొసప్రాణాలతో మృత్యువుతో పోరాటం చేస్తున్నరు. శంకర్‌ సంస్మరణ సభ ఆ రోజు హైద్రాబాద్‌ల ఆర్ట్స్‌ కాలేజీ ముందు మైదానంల జరుగుతున్నది.

Continue Reading »

Share/Save/Bookmark

- అందెశ్రీ


For Telangana … Forever !

జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥

Continue Reading »

Share/Save/Bookmark


అమరుడు కాసోజు శ్రీకాంత్ అమర్ హై !
YouTube link of martyr Kasoju Srikanths Funeral at Gunpark, Hyderabad
Picasa Photos link of martyr Kasoju Srikanths Funeral

శ్రీకాంత్ అమర్ హై !

Share/Save/Bookmark

  • తెలంగాణా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద మూడో రోజు వికలాంగుల హక్కుల వేదిక వారి నిరాహార దీక్ష
  • గన్ పార్క్ వద్ద మంత్రి శ్రీధర్ బాబు శవయాత్ర చేసి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఎబివీపి కార్యకర్తలు
  • కాసోజు శ్రీకాంత్ భౌతిక కాయం పోస్ట్ మార్టం కొరకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు

Continue Reading »

Share/Save/Bookmark

-ముస్కు రాము

జోహార్ శ్రీకాంతన్నా !!
తెలంగాణ నేల పై జన్మించిన ఓ పులిబిడ్డ
ఆఖరి జంగ్ లో అమ్మ కోసం బలి దానం చేసి
నింగి కెగసి ప్రకాశించే తారావయ్యావా !

|| జోహార్ శ్రీకాంతన్నా…||

Continue Reading »

Share/Save/Bookmark

  • జాతీయ రహదారి పై విద్యార్ధుల రాస్తారోకో వరంగల్ జిల్లాలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం
  • వరంగల్ లో వికలాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగుల ధర్నా
  • వరంగల్ జిల్లా ములుగు సెంటర్లో కాలేజీ విద్యార్ధుల భారీ ర్యాలీ
  • వరంగల్ లో కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్ధుల భారీ ర్యాలీ

Continue Reading »

Share/Save/Bookmark

- సిద్ధార్థ పాములపర్తి

ఉవ్వెత్తున ఎగిసింది ఉద్యమం మల్లి చూడు
విప్లవ చిరు జల్లుల్లు వీధి వీధిలల్ల జూడు

||ఉవ్వెత్తున||

రాజ్యాంగపు హక్కులుతో రాచరికం తిక్క కుదిరే
ప్రజాస్వామ్య గర్జనకు భూస్వాముల గుండెలదిరే

Continue Reading »

Share/Save/Bookmark

- సిద్ధార్థ పాములపర్తి

క్రూర శక్తుల కృత్రిమ హింసకు బలి కావొద్దు
అరవై తొమ్మిది ఆవేదనలు మల్లి రావొద్దు
రక్తపుబొట్లను నరముల లోనే ఉడకనియ్యి
విద్యాలయములో వీధిలో వాడలో కారనియ్యకు!

Continue Reading »

Share/Save/Bookmark

నాంపల్లిరోడ్‌ నవలఓరియంట్‌లాంగ్మన్‌ వారు ప్రచురించిన “నాంపల్లిరోడ్‌ నవల చదవని వారు తప్పక చదవాలి. హైదరాబాదు గతవైభవం, సమకాలీన జీవితం అలా అలవోకగా అందులో గుమ్మరించారు రచయిత్రి మీనా అలెగ్జాండర్‌”. ప్రముఖ ఇండో ఆంగ్లికన్‌ కవయిత్రి, రచయిత్రి అయిన మీనా రాసిన తొలి నవల అది! ‘నాంపల్లిరోడ్‌’ అనే ఇంగ్లీషు నవలలోని కథా నాయకకు ఇంగ్లీషు మహాకవి వర్డ్స్ వర్త్ ఆరాధ్యుడు. తనుకూడా ఈ హైదరాబాదు నగర సౌందర్యానికి స్పందించి, వర్డ్స్ వర్త్ లాగా కవిత్వం రాయాలనుకుంటుంది.

Continue Reading »

Share/Save/Bookmark

5

స్వామి ఆలియా స్కూలు వద్ద బస్సు దిగంగనే నిజాం కాలేజీలకు ఉరికినాడు. ఇంకా నయం. ఊరేగింపు బయలుదేరనే లేదు. సాలార్‌జంగు హాలు ఎదురుంగ ఉన్న చెట్ల దగ్గరికి చేరుకున్నడు. ఈ ఉద్యమ సందర్భంల సిటీ కాలేజీ విద్యార్థులంతా కలుసుకునే సంకేత స్థలం అదే. తన మిత్రబృందంఅంతా అక్కడనే వుంది.

“ఏం రా లేట్‌ లతీఫ్‌! ఇంత ఆలస్యంగ వచ్చినవ్‌?” అని గోపి విసుక్కున్నడు. “ఆప్‌కే ఇంతజార్‌ మే హమ్‌ ఇంతెఖాల్‌ హోగయే” అని అశోక్‌ ఆట పట్టించినాడు. జెఫ్రీ చెట్ల కొమ్మల మీద కూచోని కోతిలాగా పల్లీలు ఏరుకుని తినుకుంట కొన్ని తనకిచ్చి ‘ఇవి నీ కోసమే దాచి పెట్టినరా! తిను. దానే దానే పే లిఖా హై ఖానేవాలే కా నామ్‌’ అన్నడు. ‘అరే స్వామీ! ఈ రోజు మనం ఊరేగింపుల ముందు వరుసల్నె నడవాలె. మనం నలుగురం విడిపోవద్దు’ అని గోపి ఆదేశించినాడు. అందరూ సరే అంటే సరే అనుకున్నరు.

Continue Reading »

Share/Save/Bookmark

Older Posts »

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com