పుస్తక పరిచయ సదస్సు - “17 సెప్టెంబర్, 1948 : బిన్న దృక్కోణాలు”
సెప్టెంబర్ 21st, 2008 by డిస్కవర్ తెలంగాణ
హైదరాబద్ పై “పోలీసు చర్య” జరిగి ఈ సెప్తెంబర్ 17కు 60 యేళ్ళు నిండుతున్నాయి. ఈ “పోలీసు చర్య”ను విమోచన, విలీనం, విముక్తి, ఆక్రమణ, దాడి, దండయాత్ర పేరిట చరిత్రకారులు, విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ భిన్నభిప్రాయలు ఒక్క దగ్గరకు తీసుక వచ్చి పాఠకులు తమ అవగాహనను పెంచుకునేందుకు వీలుగా “తెలంగాణ హిస్టరీ సొసైటీ” “17 సెప్టెంబర్, 1948 : బిన్న దృక్కోణాలు” అనే పుస్తకాన్ని ప్రచురించింది. ఈ అంశంపై ఇటివల వెలుగు చూసిన వాస్తవాలను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి దీనిపై విస్తృత స్థాయిలో చర్చ జరగాలని “తెలంగాణ హిస్టరీ సొసైటీ” భావిస్తున్నది. ఈ సందర్భంగా “తెలంగాణ విద్యావంతుల వేదిక (టి.వి.వి)” “తెలంగాణ హిస్టరీ సొసైటీ (టి.హెచ్.ఎస్)” ఒక పుస్తక పరిచయ-చర్చ సదస్సును మన వరంగల్ లో నిర్వహిస్తున్నాం. మా ఈ ప్రయత్నంలో భాగస్వాములు కావాల్సిందిగా మిమ్మల్నందరిని కోరుతున్నాం.
అందరూ ఆహ్వానితులే
తెలంగాణ విద్యావంతుల వేదిక (టి.వి.వి)
తెలంగాణ హిస్టరీ సొసైటీ (టి.హెచ్.ఎస్)
వరంగల్
* * *
తావు : సెమినార్ హాల్ , హ్యుమానిటీస్ బిల్డింగ్ (కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్)
తారీఖు : 27 సెప్టెంబర్ 2008 (శనివారం)
సమయం : ఉదయం 11:00 గంటలు
ఆహ్వానం : డా||కె.విజయబాబు, అసోసియేట్ ప్రొఫెసర్, చరిత్ర విభాగం, కెయు
సభాద్యక్షత : ప్రొఫెసర్ కె.సీతారామారావు, అధ్యక్షులు, తెలంగాణ విద్యావంతుల వేదిక, వరంగల్ జిల్లా
పుస్తక పరిచయం : శ్రీ.టి.వివేక్ , కన్వీనర్, తెలంగాణ హిస్టరీ సొసైటీ
వక్తలు :
ప్రొ|| యం.కోదండరాం, టివివి రాష్ట్ర అధ్యక్షులు
శ్రీ సంగిశెట్టి శ్రీనివాస్ , తెలంగాణ హిస్టరీ సొసైటీ
శ్రీ ఎన్. వేణుగోపాల్, వీక్షణం ఎడిటర్
శ్రీ శ్రీధర్ దేశ్పాండే, తెలంగాణా టైంస్ ఏడిటర్
ముఖ్య అతిథి : శ్రీ కె.జయ శంకర్, మాజీ వైస్ ఛాన్స్లర్, కెయు
ఎవరైనా చర్చలో పాల్గొనవచ్చు
షుక్రియా : డా||పి.నరేంద్రబాబు
హెడ్ & అసోసియేట్ ప్రొఫెసర్, ప్రభుత్వ పాలనా శాస్త్రం & మానవ వనరుల నిర్వహణ విభాగం, కెయు
* * *
మరిన్ని తెలంగాణ ఆహ్వానాలు, సదస్సుల వివరాలకు “తెలంగాణ కాలెండర్” చూడుంరి





