Feed on
Posts
Comments

Category Archive for 'వ్యాసాలు'

- యం. కోదండరాం, కె. సీతారామారావు
I
భారతదేశంలో ఎన్నికలు, ఈమధ్యకాలంలో, కేవలం ప్రతినిధులను ఎన్నుకోవడానికే కాక విధాన నిర్ణయ ప్రక్రియలో ప్రజలు భాగస్వామ్యం పొందడానికి, విధాన నిర్ణయ ప్రక్రియను ప్రభావితం చేయడానికి కావలసిన శక్తిని, ప్రభావాన్ని పొందడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. అందుకే ఇటీవల కాలంలో కొన్ని పార్టీలు సామాజిక మార్పుకు ఎన్నికలను సాధనంగా వాడుతున్నాయి.
మనరాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధానంగా ఎన్నికలపైనే ఆధారపడింది. ఎన్నికల ద్వార సమైక్యవాదులను ఒంటరి చేసి, రాజకీయంగా దెబ్బకొట్టి తన […]

Read Full Post »

- యం. కోదండరాం, కె. సీతారామారావు
I
 తెలంగాణ రాష్ట్ర సమితి తరపున శాసనసభకు, శాసన మండలికి, పార్లమెంటుకు ఎన్నికైన ప్రజా ప్రతినిధుల రాజీనామాతో తలెత్తిన పరిస్థితిని అంచనా వేసుకోకుండా తెలంగాణ రాష్ట్ర సాధనఉద్యమం అనుసరించవలసిన వ్యూహాన్ని ఖరారు చేసుకోలేము. రాజీనామాకు దారితీసిన కారణాలను తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్‌ అనబడు సామాజికార్థిక, రాజకీయ వ్యవస్థ స్వరూప, స్వభావాలను అర్థం చేసుకోవాలె. తెలంగాణ పోరాటం, భాషా ప్రయుక్తత పేరుతో ఏర్పడిన ”ఆంధ్రప్రదేశ్‌” ఉమ్మడి వనరులను వాడుకొని ఎదిగి, సామాజికార్థిక వ్యవస్తలన్నింటిని శాసిస్తున్న ఆంధ్ర […]

Read Full Post »

తెలంగాణ కోసం ప్రజలు ఏ త్యాగాలకైనా సిద్ధమేనని, అంతర్జాతీయ సామ్రాజ్యవాదాన్ని, అంతర్గత వలసవాదాన్ని ఓడించేందుకు అవకాశవాద నాయకుల్ని కాదని ఉద్యమించాల్సిందేనని అంటున్నారు నాగోబా
భారతదేశం స్వాతంత్య్రం అందినాక దేశంలో జాతుల పోరాటాలు, ఉపజాతుల ఆకాంక్షలు పెల్లుబికాయి. బ్రిటిష్‌ ఇండియాలో ఏర్పడిన రాష్ట్రాలు, ప్రావిన్సులు, సంస్థానాలు ప్రజల ఆకాంక్షలను గౌరవించి, జాతుల, ఉపజాతుల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడినవి కావు. బ్రిటిష్‌ రాజ్యాధికారానికి, వారి వలస దోపిడీకి అనుకూలమైన రాజ్యవ్యవస్థనే వారు ఏర్పాటు చేసుకున్నారు.

Read Full Post »

ఏ పార్టీ వైఖరి ఎట్లున్నా తెలంగాణ అంశం అన్ని పార్టీలను ఒక చౌరస్తాలో నిలబెట్టిందనీ, ఉపఎన్నికల అనంతరం రాజకీయ పార్టీల పరిస్థితి సంక్షోభంలో పడనున్నదనీ అంటున్నారు నాగోబా
టి.ఆర్‌.ఎస్‌. ప్రజాప్రతినిధుల మూకుమ్మడి రాజీనామాలు తెలంగాణ రాజకీయోద్యమాన్ని కీలక మలుపు తిప్పింది. అదే సమయంలో సమైక్యవాదాన్ని సమర్థించే రాజకీయ పార్టీలలో తెలంగాణ వాదుల ఒత్తిడి తీవ్రతరమైంది. టి.ఆర్‌.ఎస్‌. ప్రజా ప్రతినిధుల రాజీనామాలను తెలంగాణ ప్రజలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు, మేధావులు, కవులు, రచయితలు, కళాకారులు, విద్యార్థులు స్వాగతించారు.

Read Full Post »

- యం. కోదండరాం, కె. సీతారామారావు
I
రెండవ ప్రపంచ యుద్ధానంతరం పేదరికాన్ని నిర్మూలించడానికి, అసమానతలు తొలగించడానికి ఎన్నో ప్రపంచ దేశాలు భూసంస్కరణల విధానాలను రూపొందించి అమలుచేయడం జరిగింది. కులం సామాజిక పునాదిగా గల భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని విస్తరించడానికి, ప్రతి వ్యక్తికి ఒక విలువను ఆపాదించడానికి భూసంస్కరణలు ప్రధాన విధాన సాధనాలయినవి. భూసంస్కరణల ప్రధాన లక్ష్యం ఆర్థిక సమానత్వం ద్వారా రాజకీయ ప్రజాస్వామ్యాన్ని విస్తరించడం.

Read Full Post »

- సి.విఠల్, శ్రీధరరావు దేశ్‌పాండే
వెనుకబడిన ప్రాంతాల అభివృధ్ధికి ఒక చట్టబద్ద సంస్థను ఏర్పాటు చేస్తాం, దీనిపై మీరు చర్చకు సిద్ధమేనా అని ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పెద్ద పెద్ద పత్రికా ప్రకటనల ద్వారా చర్చకు తెరతీసారు. తెలంగాన ప్రజలకు ఇటువంటి తాయిలాలు ఆంధ్రా వలస ప్రభుత్వాలు ప్రకటించడం కొత్తకాదు. తెలంగాణ ఆకాంక్షలు బలంగా తలెత్తిన ప్రతిసారి ఇటువంటి తాయిలాలను వారు తెలంగాణ ప్రజలకు చూపిస్తూపోయారు.

Read Full Post »

- ఎం. కోదండరాం, కె. సీతారామారావు
వ్యవసాయం ప్రధాన జీవికగా ఉన్న దేశాలలో భూసంబంధాలే సమాజ పరిస్థితిని, రాజకీయ ఉద్యమాల స్థితిగతులను నిర్ణయిస్తాయి. తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలన్నా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయరంగంలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకోకతప్పదు.
బ్రిటిష్‌ పాలనకు వెలుపల వున్న తెలంగాణ చరిత్రక్రమాన్ని 1956దాకా ఇక్కడి ప్రజలే నిర్ణయించుకున్నా 1956 నుండి కోస్తాంధ్ర పాలక వర్గాలు శాసిస్తున్నాయి, నిర్ధేశిస్తున్నాయి.

Read Full Post »

1956లో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల విలీనం బేషరతు విలీనం కాదు. ఆంధ్ర ప్రాంత నాయకులు తెలంగాణ ప్రజలకిచ్చిన వాగ్దానాలలో అత్యంత ప్రధానమైనది ముల్కీ రూల్సు కొనసాగింపు. 1956 నుండి 1975 దాకా అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన దాకా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆచరణలో విఫలమైనా అధికారికంగా ముల్కీ రూల్సు అమలులో ఉన్నాయి. తెలంగాణ ప్రాంత ఉద్యోగాలలో, కళాశాలల్లో ప్రవేశం పొందడానికి అభ్యర్థులు తప్పనిసరిగా ముల్కీ సర్టిఫికేట్లు సమర్పించవలసి వచ్చేది. అయితే సమైక్యరాష్ట్రంలో ముల్కీ రూల్సు యధేచ్చగా ఉల్లంఘించబడినాయి. […]

Read Full Post »

- ఎం. కోదండరాం, కె. సీతారామారావు
తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అనుసరించవలసిన వ్యూహాలు ఎత్తుగడలపై తెలంగాణవాదుల మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. 1968లో తెలంగాణ ఉద్యమ పంథా విషయంలో ఇంతటి చర్చ జరిగిన దాఖలాలు లేవు.1968లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వివిధ ఉద్యోగ, విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో మొదలయిన తర్వాత తెలంగాణ ప్రజాసమితి ఉద్యమంలో ప్రవేశించి నాయకత్వం వహించిన అనంతరం ఉద్యమానికో రాజకీయ వ్యక్తీకరణ వచ్చింది. అప్పుడు ఉద్యమం ప్రజాసమితి నేతృత్వంలో సాగింది. తెలంగాణా ప్రజాసమితి కాక ఉద్యమం […]

Read Full Post »

- యం. కోదండరాం, కె. సీతారాంరావు

I

 1956లో సమైక్యాంధ్ర రాష్ట్రం ఎర్పడ్డ తర్వాత సాగునీటిరంగంలో తెలంగాణా జల వనరులు సమగ్ర దోపిడికిలోనైనాయి. గత ఐదు దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు సాగునీటి రంగంలో అవలంభించిన వివక్షాపూరితమైన విధానాల ఫలితమే తెలంగాణాలో నేటి వ్యవసాయ సంక్షోభం. తెలంగాణా జల వనరుల చౌర్యానికవసరమైన వివక్షాపూరిత విధానాల రూపకల్పన, పథక రచన సమైక్యాంధ్ర రాష్ట్రంలో నిరంతరంగా కొనసాగుతునే ఉన్నది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ”జలయజ్ఞం” దానిలోని ప్రధాన పథకాలైన పోలవరం, […]

Read Full Post »

- సుజాతారెడ్డి ముదిగంటి
తెలుగు కథా సాహిత్యంలో తెలంగాణ కథ పెద్దపీటనే ఆక్రమించింది. ఒకప్పుడు తెలంగాణలో కవులే లేరన్నట్లు తెలంగాణలో కథ ఎక్కడిది? అని విమర్శకులు, కథా సంకలనాల సంపాదకులు అనేవారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణ కథ తెలుగులో కథ పుట్టినప్పుడే పుట్టిందని మిగతా ప్రాంతాల కంటే అధికంగానే బాధ్యతగా సామాజిక చరిత్రను చిత్రించేదిగా గుర్తింపు సంపాదించుకుంది.

Read Full Post »

తెలంగాణకు సాగునీరు, తాగునీరు, పరిశ్రమల అవసరాలు తీరుస్తోన్న శ్రీరాంసాగర్‌, బాబ్లీ ప్రాజెక్ట్‌ వల్ల 18 లక్షల ఎకరాల ఆయట్టు ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందంటున్న రఘువీర్‌
తెలంగాణ ప్రాంతానికి తీవ్ర నష్టం తెచ్చేవి ప్రస్తుతం అతి వేగంగా నిర్మితమవుతున్న బాబ్లీ, పోతిరెడ్డి ప్రాజెక్టులేనని రాజకీయ నేతలు, ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. బాబ్లీ ప్రాజెక్ట్‌ మహారాష్ట్రకు లాభం చేకూరిస్తే, పోతిరెడ్డిపాడు కడపకు లబ్ది చేకూరుస్తుంది. ఆయా ప్రాంతా లకు లబ్ది చేకూర్చే క్రమంలో తెలంగాణ ప్రాంతానికి తీవ్ర నష్టం తేనున్నాయి. […]

Read Full Post »

- ఎన్ వేణుగోపాల్
జీవో 610 మీద మరొక సారి వివాదం మొదలయింది. ఇరవైరెండు సంవత్సరాల కాలయాపన చేసిన ప్రభుత్వం నెలరోజులలోపల అమలు చేస్తానని పారదర్శకంగా అబద్ధమని తేలిపోయే ప్రగల్భాలు పలుకుతున్నది. ఆ అమలుకోసమేననే పేరుతో మరొక జీవో తెచ్చింది. కోస్తాంధ్రకు, రాయలసీమకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని తమకు తాము చెప్పుకునే నాయకులు ఆ జీవోను అమలు చేయనేగూడదని ప్రకటిస్తున్నారు. ఒక ఉద్యోగ సంఘ నాయకుడు మరొక అడుగు ముందుకువేసి తెలంగాణ దయ్యం పట్టిందని, దాన్ని వదిలించే భూత వైద్యం […]

Read Full Post »

మనవి
ఆహ్వానం - తడకమళ్ళ వివేక్‌
తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట చరిత్ర వక్రీకరణ - కె. జితేంద్రబాబు
తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణం ఆవశ్యకత- కొన్ని తక్షణ కర్తవ్యాలు - పరవస్తు లోకేశ్వర్
తెలంగాణ చరిత్ర రచనకు కొన్ని సూచనలు - డా. మలయశ్రీ
చరిత్ర రచన / నిర్మాణం - డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి
తెలంగాణ చరిత్రలోనైనా ముస్లింలకు న్యాయం జరగాలి - స్కైబాబ

Read Full Post »

”తెలంగాణా ప్రాంతంగా వ్యవహరింపబడుతున్న తొమ్మిది జిల్లాలలో చరిత్ర, శిల్పం, శాసనాలు, చిత్రలేఖనం, తాళపత్ర గ్రంధాలు, తటాకాలు, కోటలు, వీరగాధలు ఎన్నో ఉన్నాయి. సాహిత్యకారులు, కళావేత్తలు ఎందరో ఉన్నారు. అంతే గాక ఏండ్ల తరబడి కాలాన్ని తీర్చిదిద్దడానికి, దేశాన్ని పురోగమింప జేయడానికి ఎడతెగకుండా జరిపిన ఉద్యమాలున్నాయి”. అంటూ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో విలీనమై ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడుతున్నప్పుడు 1956లో ప్రచురించిన ‘తెలంగాణం’ వ్యాస సంపుటానికి ముందుమాటగా వట్టికోటి ఆళ్వారుస్వామి రాశారు.

Read Full Post »

- తడకమళ్ల వివేక్‌
మన చరిత్ర మనం రాసుకోవాల్సిన అవసరం వచ్చిందని మేం గట్టిగ నమ్ముతున్నం. మన ప్రాంతం గురించి, మన పూర్వికులు, ప్రజల స్థితిగతులు ఇంకా ఇట్లాంటి ఎన్నో సంగతులు మనకు తెల్వనీయకుండ కొందరు కుట్ర చేసిండ్రు. కొన్ని సంగతులు చరిత్రల చెప్పినప్పటికి వాటిని వక్రీకరించిండ్రు. వాండ్లు రాసిందే చరిత్ర అని మనకు చెప్పి చదివించిన్రు. శాన రోజుల వరకు మనం గూడ ఉండొచ్చు మన గతం యిదేనేమో అని నమ్మినం. మన పిల్లలకు యెనకటి సంగతులు […]

Read Full Post »

- కె. జితేంద్రబాబు
The future is dark, the present burdensome; only the past, dead and finished, bears contemplation. Those who look upon it have survived it. They are its product and its victors. No wonder, therefore, that men concern themselves with history. The desire to know what went before, the desire to understand the passage down […]

Read Full Post »

- పరవస్తు లోకేశ్వర్‌
‘ప్రజలను దోచుకునే వారే ప్రజల చరిత్రను కూడా దోచుకుంటారు.’ - సి.వి. సుబ్బారావు (సురా)
ఇప్పటి వరకు రాయబడిన చరిత్ర అంతా విజేతలచే రాయబడిన చరిత్రే. విజేతలు కేవలం తమ గురించి మాత్రమే తమ గొప్పతనాలు, ఘనమైన చరిత్ర గురించి మాత్రమే రచించి పరాజితుల గురించి, అణిచివేయబడిన వారి గురించి రాయాల్సివస్తే వక్రీకరణలు, వక్రభాష్యాలు, అపహాస్యాలతో ముగిస్తారు.

Read Full Post »

- డా. మలయశ్రీ
ఒక జాతి జన జీవన విశ్లేషణ - వివరణ చరిత్ర, అది దేశచరిత్ర, ప్రాంతీయ చరిత్ర ఏదెనా కావచ్చు. చరిత్రలో రాజకీయాల కథనం ప్రధాన భాగమైనా, అదే సమగ్ర సంపూర్ణ రచన కాదు. పాలకుల వివరాలకు ఇచ్చినంత ప్రాధాన్యత ప్రజల జీవన సంస్కృతుల వివరణకు కూడ ఇవ్వాలె. అది న్యాయం.
భారతదేశంల ఆంధ్రప్రదేశ్‌ ఒక ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రం. ఇది ఉత్తర దక్షిణ భారతదేశ - ఆర్య ద్రవిడ నాగరికతల సంగమ స్థానం. ఈ […]

Read Full Post »

- డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి
మనమిప్పుడు పునర్నిర్మాణ (డీకన్‌స్ట్రక్షన్‌) యుగంలో ఉన్నాం. నిరాఘాటంగా ముందుకు దూసుకెళ్లడానికి ఒకడుగు వెనక్కి వేయడం అవసరం. ఆ అడుగు బలమైన భూమిక మీద పడాలి. స్వాతంత్రోద్యమ కాలంలో నెహ్రూ దాదాపు ఇలాంటి మాటల్నే చెప్పి ఉన్నాడు. తెలంగాణ స్వాతంత్య్ర సాధనకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి.
దాదాపు నాలుగేళ్ల క్రితం తెలంగాణ సాంస్కృతిక వేదిక తరపున కాసుల ప్రతాపరెడ్డి సంకలనం చేసిన ‘తెలంగాణ తోవలు’ పుస్తకంలో తెలంగాణ సాహిత్య చరిత్రను రాయాలనే ఉద్దేశంతో […]

Read Full Post »

- స్కైబాబ
చిన్నప్పుడు పంద్రాగస్ట్‌కు సంబరంగా ఊరు తిరిగేది. బడి ముందల జెండా ఎగరేసినంక సార్లు, ఊరిపెద్దలు స్వాతంత్య్రం గురించి, పోరాటయోధుల గురించి చెప్తుంటే ఒళ్లంతా ఊగిపోయ్యేది. పెద్దయినంక తెలిసింది, దేశ విభజన పేరుమీద లక్షల మంది బలయ్యన్రని, సరిహద్దుల్లో రక్తం యేరులై పారిందని. ఇట్లనే నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ అని, హైదరాబాద్‌ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన రోజని చెబితే పాల మనసుతోని నిజమే అని నమ్మినం. తీరా చూస్తే - నిజాం పాలనను మించి ఆంధ్ర […]

Read Full Post »

- శ్రీధర్‌ దేశ్‌పాండే
‘కిసీ ఖౌమ్‌కో ఖతం కర్నాహైతో ఉస్కీ జబాన్‌ ఖీంచ్‌లో’ అన్న ఉర్దూ మాట ఈ మధ్య చాలాసార్లు విన్నాము. తెలంగాణ సందర్భానికి ఈ మాట చాలా అర్థవంతంగా అన్వయం అవుతుంది. 1956 నవంబర్‌ 1న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు విలీనం అయి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటైన నాటి నుంచి, తెలంగాణ అంతకు ముందు అనుభవించిన రాజ్యాధికారాన్ని కోల్పోయింది. వనరుల వినియోగంపై నియంత్రణ కోల్పోయింది. మొత్తంగా తెలంగాణ ఆంధ్రకు వలస ప్రాంతంగా మారిపోయింది. వలసవాదులు ఎపుడైనా తమ […]

Read Full Post »

- కె. శ్రీనివాస్‌
తెలంగాణ చరిత్రను నిర్మించడం కానీ, పునర్నిర్మించడం కానీ తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి అత్యవసరం. తెలంగాణ చరిత్రలో శూన్యంగా ఉన్న భాగాలు చాలా ఉన్నాయి. అక్కడ చరిత్రను నిర్మించాలి. తెలంగాణ చరిత్రలో చాలా వక్రీకరణలు, తప్పుడు వ్యాఖ్యానాలు, పొరపాటు అన్వయాలు ఉన్నాయి. అక్కడ చరిత్రను పునర్నిర్మించాలి. బాధిత అస్తిత్వంగా కానీ, సామ్రాజ్యశక్తిగా కానీ, సాంస్కృతిక నిక్షేపంగా కానీ, విశిష్ట ప్రాంతంగా కానీ తెలంగాణకు ఒక ప్రత్యేకమైన గతం ఉన్నదని గుర్తించి, ఆ పరంపరతో వర్తమానాన్ని రాజకీయంగా, […]

Read Full Post »

- సంగిశెట్టి శ్రీనివాస్‌
మన ఘన చరిత్రకు మసిబూసి, మరుగున పడేసి మీరు చరిత్ర హీనులు, కాదు కూడదంటే హీనచరిత్రులు అని ఎక్కిరించిన రాతలకు సోయి తెచ్చుకున్న తెలంగాణ మూతోడ్‌ జవాబ్‌ ఇచ్చేందుకు కలాన్ని గళాన్ని కదను తొక్కిస్తోంది. ఎన్కటి సంది ఈ సాలు అట్లనే వస్తుంది. గోలకొండ పత్రికల ముడుంబై రాఘవాచార్యులు అనే ఆంధ్రాయన ‘తెలంగాణలో కవులు పూజ్యం’ అని విమర్శిస్తూ వ్యాసం రాసిండు. దీంతోటి కడుపు మసిలిన సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు, శేషాద్రి రమణ […]

Read Full Post »

- జె. సుభద్ర
తెలంగాణ హిస్టరీ సొసైటీ ఒక అయిదారుగురు కల్సి 4-6-2006న ఫతేమైదాన్‌ క్లబ్‌లో పెట్టిండ్రని తెలిసి ఆ మీటింగుకి వెళ్లడం జరిగింది. తెలంగాణ సంస్కృతికి, భాషకు ఇక్కడి వ్యవసాయానికి ఇక్కడి ఉద్యమాలకు, ఇక్కడి రాచరిక చరిత్రలకు, సాహిత్యానికి రచయితలు, రచయిత్రులకు సంబంధించి, పత్రికలు ఇట్లా చాలా విషయాలకు సంబంధించిన చరిత్రనే కనిపించదు. తెలంగాణ ఈపై వాటన్నింటితో ప్రత్యేకమైన చరిత్ర సంస్కృతులు కలిగినగడ్డ. ఇప్పటికైనా కొద్దిమంది ఈ ప్రయత్నానికి ఆయువు పోస్తున్నట్టు బైటకొచ్చి మీటింగు పెట్టడం, ఆహ్వానించడం […]

Read Full Post »

Next »

Buying fake viagra You need to know how to viagra online pharmacy Levitra verses viagra although the thought about viagra online cheap buy viagra drugs. Purchase sildenafil buy viagra pharmacy