Feed on
Posts
Comments

Category Archive for 'పుస్తకాలు'

- దుప్పల రవికుమార్
పొరిగింట్లో జామిచెట్టు కొమ్మ మన ఇంట్లోకి వాలిందనుకోండి. ఆ కొమ్మపై పళ్లు మనవా? వాళ్లవా? మనింట్లో జామిచెట్టు కొమ్మ పొరిగింటి పిట్టగోడ మీదుగా వెళ్లిందనుకోండి, అక్కడి పళ్లు మనవా? వాళ్లవా? ఎదురింటి వాళ్ల జామికొమ్మ వాల్ల పక్కింటిలోకి వాలితే ఆ పళ్లు ఎవరివి? చెప్పండి చూద్దాం. మొదటి రెండింటికి జవాబు మనవి. మూడో ప్రశ్నకు జవాబు ఆ రెండిళ్లలో మనకు దగ్గరి వాళ్లు ఎవరైతే వారివి.

Read Full Post »

హైదరాబద్ పై “పోలీసు చర్య” జరిగి ఈ సెప్తెంబర్ 17కు 60 యేళ్ళు నిండుతున్నాయి. ఈ “పోలీసు చర్య”ను విమోచన, విలీనం, విముక్తి, ఆక్రమణ, దాడి, దండయాత్ర పేరిట చరిత్రకారులు, విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ భిన్నభిప్రాయలు ఒక్క దగ్గరకు తీసుక వచ్చి పాఠకులు తమ అవగాహనను పెంచుకునేందుకు వీలుగా “తెలంగాణ హిస్టరీ సొసైటీ” “17 సెప్టెంబర్, 1948 : బిన్న దృక్కోణాలు” అనే పుస్తకాన్ని ప్రచురించింది. ఈ అంశంపై ఇటివల వెలుగు చూసిన వాస్తవాలను అందరికీ […]

Read Full Post »

Preview this book

By Puccalapalli
Sundarayya

Published 2006
Foundation Books

472 pages

ISBN:8175963166

Add to my library

Write review

Courtesy : Google Books
 Also read Dileeps తెలంగాణా సాయుధ పోరాటం - ప్రశ్న-జవాబు

Read Full Post »

తెలంగాణలో శ్రమజీవులను ‘పనిపాటలోల్లు’ అని వ్యవహరిస్తుంటారు. శ్రామికుల పనితోపాటు పాట సాగుతుంటుంది. పొలం పనుల్లో, ఇంటి పనుల్లో, వృత్తి పనుల్లో పాటలు వినిపిస్తూనే ఉంటాయి. పనిలోని అలసటను తగ్గించి, శ్రమను మరిపించి, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పంచి ఉత్పత్తిని పెంచే శక్తి పాటకుంది. పనిలోని లయననుసరించి, శ్రామికుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అనుగుణంగా పాటకు లయ ఛందస్సు లేర్పడుతుంటాయి. శ్రామికుని జీవిత విధానం, మనోభావాల ఆధారంగా పాటలోని వస్తువు రూపుదిద్దుకుంటుంది. ఇటువంటి పనిపాటలు ప్రపంచంలోని అన్ని భాషల్లోనూ ప్రాంతాల్లోనూ వినిపిస్తుంటాయి.

[…]

Read Full Post »

1857 తిరుగుబాటులో హైద్రాబాద్‌ పాత్రను లోకానికి చాటాలన్న కోరికతో, ఆ అమరవీరులను స్మరించుకోవాలన్న ఆశతో, ఈ తరం వారికి ఆ అమరులను పరిచయం చేయాలన్న సంకల్పంతో ఈ కథల పుస్తకాన్ని మీ ముందుకు తెస్తున్నాను.
1857కు ఈ ఏడు 150 ఏండ్లు నిండాయి. అయినా ఆ పోరాటం ఇంకా కొనసాగుతున్నట్లే అనిపిస్తుంది. నేల తల్లి విముక్తి పోరాటం నుండి అనేకానేక అంతర్గత, బాహ్య నయావలసవాద వ్యతిరేక పోరాటాల వరకు, పోరాట రూపం మారిందేమో గాని ‘సారం’, ”అంతస్సూత్రం” మాత్రం […]

Read Full Post »

అంకితం
1857 హైదరాబాద్‌ తిరుగుబాటులో అమరులైన వారందరికీ,
త్యాగాలు చేసి శిక్షలు అనుభవించిన వారందరికీ.
నిజానికి ఇవేవీ నా స్వంత కథలు కావు. విషయ సేకరణ కోసం అనేక చరిత్ర గ్రంథాలపై ఆధారపడ్డాను. కొంత కల్పన, కొన్ని సన్నివేశాలు, మరికొన్ని వర్ణనలు లాంటి సృజన మాత్రమే నాది.

Read Full Post »

- ఎన్‌. వేణుగోపాల్‌
సరిగ్గా మూడు యాభైలకింద దేశమంతా అట్టుడికిపోయింది. పరాయిపాలన దోపిడీ పీడనలు ఇంకానా, ఇకపై చెల్లవు అని ఈ నేల గర్జించింది. ఉత్తర భారతంలో ప్రధానంగానూ, దేశవ్యాప్తంగా అక్కడక్కడా అన్ని వర్గాల ప్రజలూ ఆ బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. తమ మీద, తమ దేశంమీద దౌర్జన్యం సాగిస్తున్న తెల్లవాళ్లపై విరుచుకుపడ్డారు. దాదూ ఫిర్యాదూ లేకుండా వందలాది మంది భారతీయులను ఊచకోతకోసిన తెల్లవాళ్లకు అదే పద్ధతిలో జవాబుచెప్పారు.

Read Full Post »

 ’అల్లాహో అక్బర్‌’ గట్టిగా అరిచాడు అమీర్‌ఖాన్‌.
 ”ఫిరంగీ హుకూమత్‌ ముర్దాబాద్‌” అందుకున్నాడు ఫిదా అలీ.
 ”ఫైర్‌’ మిన్నూ మన్నూ ఏకం అయ్యేటట్లు అరిచాడు మేజర్‌ జనరల్‌ ఉడ్‌బర్న్‌.
 ”ఆగండి. నేను డర్‌పుక్‌ను (పిరికివాణ్ణి) కాను. మై పఠాన్‌గా బేఠాహుఁ. నన్ను ఫిరంగి మూతికి కట్టేయండి. నేనే ఫిరంగికి ఎదురుగా నిలుచుంటాను. నేను మృత్యువును ముఖాముఖంగానే చూడదలచుకున్నాను. ఈ భగావత్‌ (తిరుగుబాటు)లో పాల్గొని నా జన్మను సార్థకం చేసుకున్నాను. గతంలో నేను చేసిన పాపాలన్నింటినీ ఈ పవిత్ర జిహాద్‌ ద్వారా శుభ్రపరుచుకున్నాను. నేను […]

Read Full Post »

సయ్యద్‌ మౌల్వీ అల్లా ఉద్దీన్‌
మక్కా మస్జీద్‌ జుమ్మా నమాజులు
 1857 జూన్‌ 13 మధ్యాహ్న సమయం.
 జుహర్‌ నమాజుల కోసం మక్కా మసీదు ప్రాంగణంలో అందరూ సమావేశమవుతున్నారు. కాని అందరి ముఖాలలో ప్రశాంతత కరువైంది. ఆందోళన, భయం అందర్నీ కమ్ముకుని ఉంది. దానికి కారణం మక్కా మసీదు గోడల మీద, తలుపుల మీద అంటించిన పెద్ద పెద్ద చేతిరాతల పోస్టర్లు. తెల్లని కాగితాల మీద ఆకుపచ్చ రంగుల రాతలు.

Read Full Post »

పుట్టినప్పట్నించీ నేను ‘ఢిల్లీ’ నగరం గురించి వింటూనే ఉన్నాను.
 నేను చిన్నపిల్లవాడిగా ఉన్నపుడే మా అమ్మ చక్రవర్తి ఔరంగజేబు గురించి చెప్పింది. వాడు మా సిక్కుమతం ‘గురువు’ను చాందినీ చౌక్‌ ప్రాంతంలో ఎట్లా చిత్రవధ చేసి చంపిందీ తర్వాత కాలంలో అదే స్థలంలో మా వాళ్ళు అతి పెద్ద అందమైన గురుద్వారాను ఎట్లా నిర్మించిందీ ఒక కథగా వినిపించేది. ఆమెకు ఔరంగజేబు పట్ల ఎంత అసహ్యం ఉండేదంటే ఆ పేరును ఉచ్చరించిన ప్రతీసారీ ‘థూ’ అని ఉమ్మివేసేది. నేను […]

Read Full Post »

… చావూష్‌ల గురించి ప్రత్యేకంగనే చెప్పుకోవాలె. వీళ్ళందరూ అఫ్రికాకు సంబంధించిన ముస్లింలు. వీరు ప్రధానంగ రెండు దేశాలకు ఎమెన్, అబిసీనియాలకు చెందినవాళ్ళు. అబిసీనియా కొత్త పేరు ఇథియోపియా. అబిసీనియా వాళ్ళను ‘హబ్సీ’లు అని కూడ అంటరు. నగరంలోని హబ్సిగుడా వీళ్ళకు సంబంధించినదే. వీళ్ళను చూడంగనే నీగ్రోలని సులభంగ గుర్తించవచ్చు. ఈ హబ్సీలు అనగా చావూష్‌లు హైద్రాబాద్ నగరానికి చేరుకున్న వైనం ఒక ఇతిహాస గాథ.

Read Full Post »

నీళ్లు-నిజాలు
(వ్యాసాల సంకలనం)
ఆర్. విద్యాసాగరరావు
చీఫ్ ఇంజనీరు (రిటైర్డ్)
కేంద్ర జల సంఘం

తెలంగాణ విద్యావంతుల వేదిక
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (USA)
జనవరి 2006

Read Full Post »

ఒకటవ భాగము
భారతదేశంలో జలసంపద - అభివృద్ధి - సమస్యలు

నీటి లభ్యత
నదీ బేసిన్లు
సాగునీరు
వరదలు-నియంత్రణ
విద్యుత్ సంపద

Read Full Post »

ప్రకృతిప్రసాదించిన జీవనదులు దేశాల మధ్యా, రాష్ట్రాల మధ్యా మైత్రీహారాలుగా, సుహృద్భావ సేతువులుగా ఉండవలసింది పోయి మనిషి స్వార్థం, సంకుచిత రాజకీయ ప్రయోజనాల కారణంగా వివాదాలు రగిలిస్తున్నాయి. 21వ శతాబ్దంలో యుద్ధాలు నీటికోసమే జరుగుతాయంటూ ఈజిప్టు సామాజిక శాస్తవ్రేత్త ఇస్మాయిల్ సెరాగెల్డిన్ చెప్పిన జోస్యం నిజమయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్, కర్నాటకల మధ్య కృష్ణా జలాలకు సంబంధించి అలమట్టి సమస్య, కర్నాటక, తమిళనాడు మధ్య కావేరీ జలకలహం, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మధ్య రావి-బియాస్ జలవివాదం ఎప్పుడు ముదిరి […]

Read Full Post »

నీళ్ల పైన నేను రాస్తాననిగాని, రాయాలనికాని ఎన్నడూ అనుకోలేదు. చిన్నతనం నుంచీ నేను రాసింది కవిత్వం, కథలు, నాటికలు - వేసింది స్టేజిపైన నాటకాలు, రేడియో, దూరదర్శన్లో నాటికలు. ఈ రేడియో పిచ్చి ఎంతదాకా వెళ్లిందంటే నేను క్యాసువల్ ఆర్టిస్ట్‌గా రేడియోలో వార్తలు చదవడం, అనౌన్సర్‌గా పని చేయడం మొదలుకుని భారత ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలు తెలుగులో వేయికిపైగా రేడియోలో నాటికల రూపంలో దశాబ్దానికి పైగా రాయడం ప్రసారం చేయడం వరకు సాగింది. నా రచనా వ్యాసంగం […]

Read Full Post »

ప్రపంచ వ్యాప్తంగా నీటి వనరులు నానాటికీ తగ్గిపోతున్నాయన్నమాట వాస్తవం కాదు. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం భూమిపై ఉన్న నీరు 140 కోట్ల ఘనపు కిలోమీటర్లు. అంటే ఆ నీటిని మన భూమిపైన విస్తరింపజేస్తే అది మూడు కిలోమీటర్ల ఎత్తుంటుంది. అయితే ఈ నీటిలో 97శాతం పైగా ఉప్పునీరు. సముద్రాలలో దాగుంది. మిగిలిన స్వచ్ఛమైన నీటిలో సుమారు 77.6 శాతం ధృవాలలో మంచురూపంలో, 21.8 శాతం భూగర్భంలో చాలా లోతున నిక్షిప్తమై ఉంది. అంటే మనకు లభ్యమయ్యే నదులలో, […]

Read Full Post »

నది అనేది హైద్రాలాజికల్‌ సిస్టంలో సహజమైన ఉనికి గల ఒక వివేషం (Entity). దానికి భౌగోళికపరమైన సరిహద్దులుంటాయి. నదిని మొత్తంగా పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి పథకాలు చేపట్టడమనేది శ్రేష్ఠమైన పని. కాని దురదృష్టవశాత్తూ రాజకీయం కారణంగా అది సాధ్యమయ్యే పని కాదు.
మన దేశంలో ఆయా రాష్ట్రాలు, తమ సరిహద్దుల్లోని నదులపై అభివృద్ధి పథకాలను రూపొందించి కేంద్ర జల సంఘానికి పంపటం రివాజు. అంతేగాని నదీబేసిన్‌పై సమగ్ర అభివృద్ధి పథకాలను (ఏ రాష్ట్రం, ఎంత నీరు అన్నది […]

Read Full Post »

మన దేశంలో మొత్తం సాగుకాగల భూమి 13.988 కోట్ల హెక్టేర్లుగా (ఒక హెక్టారనగా సుమారు రెండున్నర ఎకరాలు) అంచనా వేసారు. ఇందులో భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా 5.846 కోట్ల హెక్టేర్లు మిగతా 8.142 కోట్ల హెక్టేర్లు చిన్నతరహా ప్రాజెక్టుల ద్వారా జరగవలసి ఉంది. భూగర్భ జలాల నుండి సాగయ్యే 6.40 కోట్ల హెక్టేర్లు చిన్నతరహా ప్రాజెక్టు కోవకే చెందుతాయి. మార్చి 2005 నాటికి భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారా 4 కోట్ల మూడు లక్షల […]

Read Full Post »

ఇంత సువిశాల దేశంలో, వైవిధ్యం కలిగిన వాతావరణం, పోకడలలో దేశంలో ఏదో ఓ మూల వరద, మరోచోట దుర్భిక్షం ఏక సమయంలో సంభవించడం అసహజమేమీ కాదు. ఒకేసారి ఒకే రాష్ట్రంలో కొన్నిచోట్ల వరదలు సంభవిస్తుంటే కొన్ని ప్రాంతాలు క్షామానికి గురై తల్లడిల్లడం కూడా గమనిస్తున్నాం. ఆదినుండీ, మానవుడు వరదతో సహజీవనం సాగిస్తున్నాడు. అయితే పూర్వపు రోజుల్లో మనుషులు తక్కువ ఉండేవారు. పారిశ్రామిక కార్యకలాపాలు అంతగా లేకపోవడం, వరద ప్రాంతాలలో (ఫ్లడ్‌ ప్లెయిన్స్‌)లో అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకోకపోవడంవల్ల […]

Read Full Post »

మన దేశంలో అపారమైన జల విద్యుత్‌ సంపద ఉంది. 1987 సంవత్సరంలో కేంద్ర విద్యుత్‌ సంస్థ (సిఇఎ) వారు చేపట్టిన అధ్యయనం ప్రకారం మన దేశంలో 84 వేల 44 మెగావాట్ల జలవిద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం (60 శాతం లోడ్‌ ఫ్యాక్టర్‌ ప్రాతిపదికన) ఉంది. చిన్న చిన్న విద్యుత్‌ పథకాలు, పంప్‌ స్టోరేజి పథకాలు ఉత్పత్తి చేసే విద్యుత్తును కూడా కలుపుకుంటే మన దేశంలో సుమారు 94 వేల మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం (60 […]

Read Full Post »

ఒకానొక కాలంలో మన దేశంలో అన్ని రవాణా వ్యవస్థల్లోకెల్లా నదీరవాణా అగ్రగామిగా ఉండేది. అయితే రైలుమార్గాలు అధునాతన సాంకేతికతో రహదార్లు పుంజుకోవడంతో దీనికితోడు నదీరవాణా సేవ నిర్వహణ లోపాలు తోడయ్యి నదీరవాణా తన ప్రాధాన్యతను కోల్పోయింది. ఇప్పటికీ అంతో ఇంతో మెరుగ్గా నదీరవాణా నిర్వహిస్తున్న రాష్ట్రాలుగా గోవా, పశ్చిమబెంగాల్‌, అస్సాం, కేరళలను చెప్పుకోవచ్చు.

Read Full Post »

ఉపరితల జలాలు
రాజ్యాంగంలో 246 అధికరణంలో ఏడవ షెడ్యూల్‌లో మూడు జాబితాలున్నాయి.
కేంద్రజాబితా: ఇందులో జతపరిచిన విషయాలకు సంబంధించిన చట్టాలను చేసే అధికారం పార్లమెంటుకే ఉంది.
రాష్ట్రజాబితా: ఇందులో పొందుపరిచిన విషయాలపై చట్టాలను రూపొందించే అధికారం ఆయా రాష్ట్ర శాసన సభలకే ఉంది.
ఉమ్మడి జాబితా: ఇందులో ఉటంకించిన విషయాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు, శాసనసభకు ఉభయులకూ ఉంది.

Read Full Post »