Posted in హైదరాబాద్ ఎవరిది?, ఆంధ్రజ్యోతి, తెలుగు on నవంబర్ 13th, 2008
-కడెంపల్లి సుధాకర్
మన ముఖ్యమంత్రి ఎన్నికలను ఎప్పుడూ ఒక క్రీడగా పోల్చుతారు. క్రీడా స్ఫూర్తితో పాల్గొంటే వచ్చే ఎన్నికలలో ‘బంగారు పతకం’ పొందడం ఖాయమని ఆయన పదే పదే అంటున్నారు. అయితే ఏ ఆటలోనైనా గెలవాలంటే ఆ ఆటలో విధిగా అనుసరించాల్సిన కొన్ని నియమాలు, ఒక క్రమశిక్షణ ఉంటాయన్న వాస్తవాన్ని ఆయనగాని , ఎవరుగాని మరచిపోకూడదు.
Read Full Post »
హైదరాబాద్, సెప్టెంబర్ 17, 2008 : భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్న రాజ్యం హైదరాబాద్ సంస్థానం. నిజాం రాజుల పాలన కింద ఉన్న ఆ రాజ్యాన్ని నాటి భారత పాలకులు సైనిక చర్య ద్వారా 1948లో ఇండియన్ యూనియన్లో విలీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 17న ఈ సంఘటన జరిగింది. ఐదు రోజులు… వంద గంటల్లో సైనిక చర్య ముగిసింది.
Read Full Post »
Posted in ఆంధ్రజ్యోతి, తెలుగు, హైదరాబాద్ విమోచన on సెప్టెంబర్ 17th, 2008
హైదరాబాద్, సెప్టెంబర్ 16(ఆన్లైన్): తెలంగాణ విముక్తి దినోత్సవం బుధవారం నాడు తెలంగాణలో ఊరూరా జరుగనుంది. దీనిని గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్ని రాజకీయ పార్టీలు జరుపుకోనున్నాయి. తమ తమ పార్టీ కార్యాలయాల్లో జాతీయ పతాకాలు ఎగురవేయనున్నాయి. ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలంటూ బీజేపీ జైల్ భరో కార్యక్రమం చేపట్టనుంది. సీపీఐ, సీపీఎం పార్టీలు సైతం పలుచోట్ల సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాయి.
Read Full Post »
Posted in ఆంధ్రజ్యోతి, తెలుగు, హైదరాబాద్ విమోచన on సెప్టెంబర్ 17th, 2008
- బండారు దత్తాత్రేయ
నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రాంత విముక్తి జరిగి ఈ నెల 17వ తేదీతో 60 సంవత్సరా లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రాంత ప్రజలు అధి కారికంగా ఉత్సవం జరుపుకునే అదృష్టానికి నోచుకోకపోవ డం అత్యంత బాధాకరం. నాటి హైదరాబాద్ సంస్థానం విముక్తి తర్వాత భాషా ప్రాతిపదికన విడిపోయి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో విలీనమైన ప్రాంతాలలో అక్కడి ప్రజలు అధికారికంగా 1948 సెప్టెంబర్ 17వ రోజు స్వాతంత్య్రం లభించిన రోజుగా ఉత్సవాలు […]
Read Full Post »
Posted in సంపాదకీయం, తెలుగు, హైదరాబాద్ విమోచన on సెప్టెంబర్ 17th, 2008
- ఎన్. వేణుగోపాల్
సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందని ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం , భారతీయ జనతా పార్టీ ఈ కట్టు కథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ‘మా వైపు లేకపోతే వాళ్లవైపు ఉన్నట్టే’ అని ప్రపంచాన్ని బెదిరించిన జార్జి బుష్ లాగ ‘దీన్ని విమోచనం అనకపోతే రజాకార్ల వైపు ఉన్నట్టే’ అని బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చిన […]
Read Full Post »
Posted in G.Os, తెలుగు, వ్యాసాలు on ఫిబ్రవరి 20th, 2008
1956లో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల విలీనం బేషరతు విలీనం కాదు. ఆంధ్ర ప్రాంత నాయకులు తెలంగాణ ప్రజలకిచ్చిన వాగ్దానాలలో అత్యంత ప్రధానమైనది ముల్కీ రూల్సు కొనసాగింపు. 1956 నుండి 1975 దాకా అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆచరణలో విఫలమైనా అధికారికంగా ముల్కీ రూల్సు అమలులో ఉన్నాయి. తెలంగాణ ప్రాంత ఉద్యోగాలలో, కళాశాలల్లో ప్రవేశం పొందడానికి అభ్యర్థులు తప్పనిసరిగా ముల్కీ సర్టిఫికేట్లు సమర్పించవలసి వచ్చేది. అయితే సమైక్యరాష్ట్రంలో ముల్కీ రూల్సు యధేచ్చగా ఉల్లంఘించబడినాయి. […]
Read Full Post »
లెక్కల్లో హైదరాబాద్ ఎవరికి దక్కేను? వ్యాసానికి సి. శ్రీనివాస్ జవాబు
నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగర నిర్మాణ పునాది నుంచి అణువణువునా తెలంగాణ ప్రజలతోపాటు కోస్తా, రాయలసీమ ప్రజల కష్టం కలగలిసి ఉంది. ఎవరో ఏదో చెప్పారనో లేదా కేవలం కొన్ని ప్రాంతాల నాయకులు హైదరాబాద్ను అభివృద్ధి పథంలో న డిపారనో దాని మీద కోస్తా, రాయలసీమవాసులకు హక్కుందని అంటున్నారన డం అర్థరహితం. గోల్కొండ కోట కట్టించింది నిడదవోలు వీర భద్రుడి బంధువులు ఆంధ్రనగరి పాలకులైన కాకతీయులైతే […]
Read Full Post »
Posted in హైదరాబాద్ ఎవరిది?, ఆంధ్రజ్యోతి, తెలుగు on ఫిబ్రవరి 12th, 2008
- సి. విఠల్, శ్రీధరరావు దేశ్పాండే
అసమ అభివృద్ధికి సంబంధించిన అసంతృప్తులు దేశంలోని అనే క ప్రాంతాలలో స్వాతంత్య్రసిద్ధి నాటినుంచి ఉన్నప్పటికీ ప్రత్యే క రాష్ట్రం కోసం తొలినుంచి డిమాండ్ చేసిన గడ్డ బహుశా తెలంగాణ ఒక్కటేనేమో? ప్రత్యేక తెలంగాణ ఆరాటంలో ముల్కీ ఉద్య మం (1952) తొలి దశ కాగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం (1969) మలి దశ. వర్తమాన తెలంగాణ ఉద్యమం (ఇది తుది, ఫలప్రదమైన దశ అవగలదని ఆశిద్దాం) 1990ల నుంచి నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ […]
Read Full Post »
- కట్టా శేఖర్ రెడ్డి
ఇప్పుడు తెలంగాణను తెచ్చుకున్నా అది దొరలపాలవుతుంది. బడుగులకు రాజ్యాధికారం దక్కదు. వై.ఎస్. నేతృత్వంలో పూర్తిస్థాయి అభివృద్ధి జరిగాక ప్రత్యే క రాష్ట్ర అంశం తెరపైకి రావాలి. ప్రస్తుత తరుణంలో ప్రత్యేక రాష్ట్రం కంటే అభి వృద్ధే ముఖ్యం.
-తెలంగాణ డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీలు
‘ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయితే కోస్తాంధ్రుల పెత్తనం ఎక్కువయి పోతుంది. వారితో నెగ్గలేం. మాకు ప్రత్యేక రాష్ట్రం వద్దు. మద్రాసు రాష్ట్రం లోనే కొనసాగుతాం’- ఇది అప్పట్లో ఆంధ్ర రాష్ట్ర ఉద్య మానికి […]
Read Full Post »
Posted in నిజాం చర్చ, ఆంధ్రజ్యోతి, తెలుగు on డిసంబర్ 6th, 2007
- సంగిశెట్టి శ్రీనివాస్
‘మీకు చరిత్ర లేదు. ఉంటే గింటే అది హీన చరిత్రే, చరిత్ర హీనులే’ అని యాభై ఏళ్ళుగా ఆంధ్ర వలసవాదులు రాస్తున్న పుస్తకాలు, చేస్తున్న విష ప్రచారం తెలంగాణ అంతటా పాఠ్యపుస్తకాలై విస్తరించాయి. ‘ప్రారంభం నుంచి చివరి వరకూ ఏ ప్రాంతీయ తేడాలు లేకుండా తెలంగాణ పోరాటం తెలుగు ప్రజలందరి పోరాటంగా విశాలాంధ్ర కమ్యునిస్టు కమిటీ నాయకత్వంలో జరిగిం’దని అబద్ధాల్ని అక్షరబద్ధం చేస్తున్నారు. ‘ఈ పోరాటంలో వీర తెలంగాణ రైతాంగమూ, ఈ రైతాంగ ప్రజల […]
Read Full Post »
Posted in నిజాం చర్చ, ఆంధ్రజ్యోతి, తెలుగు on డిసంబర్ 6th, 2007
- వరవరరావు
హైదరాబాద్ నగరంలో చార్మినార్ పాతబస్తీలో ప్రవేశిం చండి- లేదా నగరంలో ఎక్కడైనా కాళ్లు చేతులాడించే బతుకుదెరువు మార్గాలను వెతుక్కునే వాళ్లను చూడండి-వాళ్లు ముస్లింయి ఉంటారు, లేదా దళితులయి ఉంటారు. చంద్రశేఖర్రావు నాలుగున్నరవందల సంవత్సరాల వీళ్ల సంస్కృతి గురించి మాట్లాడి ఉండవలసింది. వీళ్లు భాషా సాహిత్యాలకు చేసిన సృజనాత్మక సేవ గురించి మాట్లాడి ఉండవలసింది.
Read Full Post »
Posted in నిజాం చర్చ, ఆంధ్రజ్యోతి, తెలుగు on డిసంబర్ 5th, 2007
- ఎన్. వేణుగోపాల్
జేమ్స్ జాయిస్ నవల ‘యులిసెస్’ లో ఒక పాత్ర- ‘చరిత్ర నేను మేల్కొనదలచుకున్న ఒక పీడకల’ అంటుంది. ‘చరిత్రంటే జనం అంగీకరించడానికి ఇష్టపడే మిధ్య’ అన్నాడట నెపోలియన్. ఇవాళ పీడకల అయిన చరిత్ర నుంచి మేల్కొనడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ మిధ్య అయిన చరిత్రలోకి ప్రయాణిస్తున్నటున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు ఏ కారణంతో ఈ వివాదం రేకిత్తించారో, ఆ కారణం ఫలిస్తుందో లేదో తెలియదు గాని, ‘చారానా దావత్కు బారానా టాంగా’ అన్నట్టు పావలా […]
Read Full Post »
Posted in నిజాం చర్చ, ఆంధ్రజ్యోతి, తెలుగు on డిసంబర్ 4th, 2007
- నందిని సిధారెడ్డి
మరోసారి కెసిఆర్ వివాదస్పద వ్యాఖ్య చేశారు. ఈ సారి వ్యాఖ్య వరకే ఆగకుండా సాగదీసి నిర్భయంగా సహజ అతివాదానికి పూనుకోవటం మరింత చర్చకు దారితీసింది. నిజాం రాజులు మంచివారని, వాళ్ల పాలన భేషుగ్గా ఉందని సమాధి దగ్గర ప్రస్తుతించటంతో పాటు తర్వాత అదేమాట వెయ్యి సార్లు అంటానని ప్రకటించుకున్నారు. తెరాస ప్రతినిధి ప్రకాశ్ అయితే గ్రామ గ్రామాన నిజాం విగ్రహాలు నెలకొల్పుతాని కూడా పొడిగించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లకోసం కెసిఆర్ అట్లా […]
Read Full Post »
Posted in నిజాం చర్చ, ఆంధ్రజ్యోతి, తెలుగు on డిసంబర్ 2nd, 2007
- కె. రామచంద్రమూర్తి
ఉన్నత పదవులలో ఉన్న రాజకీయ నాయకులకు అనేకమంది సలహాదారులు ఉంటారు. నాయకుడు అడిగితే సలహాలు చెప్పేవారు కొందరైతే అయాచితంగా సూచనలు చేసేవారు కొందరు. ఏ సలహాను స్వీకరిస్తారన్న దానిపైన నాయకుల జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. ఎంతమంది ఎన్ని రకాల సలహాలు ఇచ్చినా అంతిమ నిర్ణయం తీసుకోవలసింది నాయకులే.
Read Full Post »
Posted in నిజాం చర్చ, ఆంధ్రజ్యోతి, తెలుగు on డిసంబర్ 2nd, 2007
- కట్టా శేఖర్రెడ్డి
నిజాం నవాబుల సుదీర్ఘపాలనలో రజాకార్ల ఆగడాలు జరిగింది చాలా తక్కువ కాలమే. ఆ సమయంలో ప్రజలు బాధ పడింది నిజమే. అయితే ఏ దేశంలోనయినా, ఏ సమాజంలో నయినా గత వైభవాన్ని స్మరించుకోవడం సంప్రదాయం. ప్రజలను పీడించిన రాజుల మంచి పనులనూ కీర్తిస్తూనే ఉన్నాం. అదే విధంగా ఈ ప్రాంతానికి మేలు చేసిన నిజాంకు, కాకతీయ రాజులకు సైతం సలాం చేస్తాం. దాంట్లో తప్పే ముంది?… అవును. నిజాంల గురించి ఒకటి కాదు… వెయ్యి […]
Read Full Post »
Posted in నిజాం చర్చ, ఆంధ్రజ్యోతి, తెలుగు on డిసంబర్ 1st, 2007
- అల్లం నారాయణ
నిజామ్కు మొక్కుమంటవా !
దొరా !
నీబాంచెన్.
నిజాం ఏడేడు తరాలకు
దండేసి దండం పెట్టమంటవా !
ఆయనకే కాదు. తెలంగాణను పొరుకపోడుచేసిన జాగీర్దార్లు, జమీందార్లు, దేశ్ముఖ్లు, రెడ్లు, వెలమదొరలకు కూడా సాగిలపడి సలామ్ చెయ్యమంటవా! ఎన్నేండ్లు మొక్కమంటవు. ఎన్నేండ్లు బాంచెగిరి చెయ్యమంటవ్.
Read Full Post »
Posted in నిజాం చర్చ, ఆంధ్రజ్యోతి, తెలుగు on డిసంబర్ 1st, 2007
- తెలంగాణ కవులు, రచయితలు
ఎన్నాళ్లుగానో ఇటు కమ్యూనిస్టులు, అటు భారతీయ జనతాపార్టీ- నిజాం పాలనా కాలాన్ని తప్పుగా చిత్రిస్తూ వస్తున్నాయి. ఇంత కాలానికైనా మంచి చర్చకు కెసిఆర్ తలుపులు తెరిచారు. కెసిఆర్ మాట్లాడిన విషయాల మీద ఎప్పటికైనా చర్చ జరగవలసిందే. ఆయన చెప్పినవి వాస్తవాలే. ఇప్పటికైనా ఆ విషయాలు చర్చకు వచ్చినందుకు సంతోషం. అప్పటి పోరాటాలను స్మరించుకుంటూనే, రజాకార్ల దుర్మార్గాలను విమర్శిస్తూనే, నిజాం రాజు దురాగతాలను ఖండిస్తూనే ఆయన చేసిన మంచిని గుర్తుచేసుకోవడం, స్మరించుకోవడం ఎంత మాత్రము […]
Read Full Post »
Posted in నిజాం చర్చ, ఆంధ్రజ్యోతి, తెలుగు on నవంబర్ 30th, 2007
- వి.ప్రకాశ్
నిజాం పాలనలో మతసామరస్యం వెల్లివిరిసిందని చెబుతూ, పీడకులైన రాజులు చేసిన మంచిపనులను కీర్తిస్తే తప్పెలా అవుతుందని తెరాస అధ్యక్షులు కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను కొందరు వివాదాస్పదం చేస్తున్నారు. నిజాం పాలనకు కెసిఆర్ వంద మార్కులు వేసినట్లు, తెలంగాణ సాయుధపోరాటాన్ని, అమరుల త్యాగాలను అవమానపర్చినట్లు విపరీతవ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలోనే అరుదైన మహోజ్వల పోరాటం తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం. కెసిఆర్తో పాటు తెరాసలోని ప్రతి ఒక్కరూ ఆ పోరాటయోధుల వారసత్వాన్ని కొనసాగించాలనే ఆరాటపడుతున్నారు. అమరుల త్యాగాలను […]
Read Full Post »
Posted in నిజాం చర్చ, సంపాదకీయం, ఆంధ్రజ్యోతి, తెలుగు on నవంబర్ 29th, 2007
వర్తమానంలో సరైన దృక్పథాన్ని ఏర్పరచుకోవడానికీ, నిర్మాణాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడానికీ గతాన్ని సవ్యంగా అర్థం చేసుకోవాలి. గతాన్ని అపార్థం చేసుకొని వర్తమానాన్ని సంక్షోభంలోకి నెట్టుకోవడం వివేకవంతుల లక్షణం కాదు. రాజకీయ నాయకులు ప్రతి అక్షరం ఆచితూచి మాట్లాడాలి. చరిత్రను బోధించే అధ్యాపకుడు లేదా చరిత్రను అన్వయించే రచయిత హైదరాబాద్ నిజాంపైన ఎటువంటి అభిప్రాయం వెలిబుచ్చినా పెద్ద నష్టం ఉండకపోవచ్చు. నిజాం పాలన గురించి ప్రముఖ కవి కాళోజీ మాట్లాడినంత వివాదాస్పదంగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు చంద్రశేఖరరావు (కేసీఆర్) […]
Read Full Post »
Posted in నిజాం చర్చ, ఆంధ్రజ్యోతి, తెలుగు on నవంబర్ 28th, 2007
- తెలకపల్లి రవి
‘చుట్టు ముట్టు సూర్యాపేట, నట్టనడుమ నల్లగొండ, నీవుండే హైద్రాబాదు, దాని పక్కా గోలకొండ, గోలకొండ ఖిల్లా కింద, గోలకొండ ఖిల్లా కింద, నీ గోరి కడ్తము కొడకో నైజాము సర్కరోడా!‘ ఎప్పుడు ఎక్కడ ఎవరు పాడినా ఉర్రూతలూపే పాట. సుప్రసిద్ధమైన ఈ ప్రజా గీతాన్ని సాహిత్య శిల్పానికి ఉదాహరణగా తరచూ చెబుతుంటాను. ఎందుకంటే ఇందులో మొదటగా భూగోళ శాస్త్రంలా ఊళ్ళ పేర్ల జాబితా ఇస్తున్న కవి యాదగిరి ఒక్కసారిగా దాన్ని మలుపు తిప్పుతాడు. నిజాం […]
Read Full Post »
Posted in నిజాం చర్చ, ఆంధ్రజ్యోతి, తెలుగు on నవంబర్ 26th, 2007
(ఆన్లైన్, సిటీబ్యూరో): ‘తరతరాల బూజు నిజాం రాజును కీర్తించడం కె.చంద్రశేఖరరావు అహంభానికి దర్పణం. అంతేగాక, వేలాదిమంది అమరవీరుల త్యాగాలను కించపరడమే’నని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఒక ప్రకటనలో విమర్శించింది. రాచరిక పాలనను ప్రశంసించడమంటే ప్రజల గోళ్లు ఊడగొట్టి వసూలు చేసే పన్నుల పద్ధతిని సమర్థించడమే అవుతుందని కమిటీ నాయకులు పేర్కొన్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు గట్టిగా వ్యతిరేకిస్తున్నారని వారు పేర్కొన్నారు.
Read Full Post »
Posted in నిజాం చర్చ, ఆంధ్రజ్యోతి, తెలుగు on నవంబర్ 26th, 2007
- సురవరం సుధాకర్రెడ్డి
ప్రజాకంటకంగా సాగిన నిజాం పాలనను పొగడటం ద్వారా తెలంగాణ విముక్తి పోరాటాన్ని కేసీఆర్ అవమానించారని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి విమర్శించారు. “నిజాం పాలన 20వ శతాబ్దకాలంలో ఉండకూడనిది. పౌరహక్కులు లేకుండా వెట్టిచాకిరీ, దోపిడీ వ్యవస్థతో కూడిన ఆ దుర్మార్గ పాలనపై ప్రజలే తిరుగుబాటు చేశారు.
Read Full Post »
Posted in నిజాం చర్చ, ఆంధ్రజ్యోతి, తెలుగు on నవంబర్ 26th, 2007
హైదరాబాద్, నవంబర్ 26 (ఆన్లైన్): “నాలుగు వందల యాభై సంవత్సరాల నిజాం పరి పాలనలో మత సామరస్యం వెల్లివిరిసింది. విభిన్న సంస్కృతులకు చెందిన అన్ని మతాల ప్రజలూ సహజీవనం చేశారు. నిజాం నవాబుల సుదీర్ఘ పరిపాలనలో రజాకార్ల అరాచకాలు జరిగింది చాలా తక్కువ కాలమే. ఆ సమయంలో ప్రజలు బాధ పడింది నిజమే. అయితే ఏ దేశంలోనైనా, ఏ సమాజంలోనైనా గత వైభవాన్ని స్మరించుకోవడం సంప్రదాయం.
Read Full Post »
Posted in G.Os, ఆంధ్రజ్యోతి, తెలుగు on జులై 10th, 2007
- ఆర్. విద్యాసాగరరావు
తెలంగాణ సాగునీటి సమస్యకు సూక్ష్మ సేద్యమే మార్గాం తరమా? సరిగ్గా ఐదు నెలల క్రితం మన రాష్ట్ర ప్రభు త్వం ఒక ఉత్తర్వు జారీచేసింది. గత ఫిబ్రవరి 9న జారీచేసిన జీ.వో. 34 ప్రాథమికోద్దేశ్యం బిందు సేద్యం, తుంపర్ల సేద్యం ద్వారా నీటిని ఆదా చేసి, తద్వారా మరింత భూమిని సాగులోకి తేవడం. వచ్చిన చిక్కేమిటంటే ఈ ఉత్తర్వును ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు అమలుపరుస్తారన్నదే!
Read Full Post »
Posted in కౌంటర్, G.Os, ఆంధ్రజ్యోతి, తెలుగు on జులై 8th, 2007
ఆంధ్రజ్యోతి జూన్ 02న ‘610 అమలు అనివార్యం’ అని వచ్చిన ధర్మవరపు సీతారాం వ్యాసానికి చందా రాములు జవాబు
తెలంగాణ పట్ల నిస్పక్షపాతంగా రాసినట్లుందని చాల కుతూహలంతో చదివాను. నాలుగు పేరాలవరకు బాగానే అనిపించింది. ఇక అక్కడనుండి ఇతర ఆంధ్ర-సీమల రచయితల మాదిరే ఈయన రాత కూడా కొనసాగింది. 610 జిఓ అనివార్యం అంటూనే యుడిసీలను,ఎల్డీసీలను,డ్రైవర్లను & ప్యూన్లను ఇక్కడినుండి పంపమని ప్రతాపం చూపుతారా? అంటు ఈమధ్య టీఅరెస్ వాళ్ళు కౌన్సిలింగుకు ఆఫిసులకు పోయిచెప్పిన వారిని ప్రశ్నించారు.
[…]
Read Full Post »