హైదరాబాద్, సెప్టెంబర్ 17, 2008 : భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్న రాజ్యం హైదరాబాద్ సంస్థానం. నిజాం రాజుల పాలన కింద ఉన్న ఆ రాజ్యాన్ని నాటి భారత పాలకులు సైనిక చర్య ద్వారా 1948లో ఇండియన్ యూనియన్లో విలీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 17న ఈ సంఘటన జరిగింది. ఐదు రోజులు… వంద గంటల్లో సైనిక చర్య ముగిసింది.
Read Full Post »
Posted in ఆంధ్రజ్యోతి, తెలుగు, హైదరాబాద్ విమోచన on సెప్టెంబర్ 17th, 2008
హైదరాబాద్, సెప్టెంబర్ 16(ఆన్లైన్): తెలంగాణ విముక్తి దినోత్సవం బుధవారం నాడు తెలంగాణలో ఊరూరా జరుగనుంది. దీనిని గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్ని రాజకీయ పార్టీలు జరుపుకోనున్నాయి. తమ తమ పార్టీ కార్యాలయాల్లో జాతీయ పతాకాలు ఎగురవేయనున్నాయి. ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలంటూ బీజేపీ జైల్ భరో కార్యక్రమం చేపట్టనుంది. సీపీఐ, సీపీఎం పార్టీలు సైతం పలుచోట్ల సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాయి.
Read Full Post »
Posted in ఆంధ్రజ్యోతి, తెలుగు, హైదరాబాద్ విమోచన on సెప్టెంబర్ 17th, 2008
- బండారు దత్తాత్రేయ
నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రాంత విముక్తి జరిగి ఈ నెల 17వ తేదీతో 60 సంవత్సరా లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రాంత ప్రజలు అధి కారికంగా ఉత్సవం జరుపుకునే అదృష్టానికి నోచుకోకపోవ డం అత్యంత బాధాకరం. నాటి హైదరాబాద్ సంస్థానం విముక్తి తర్వాత భాషా ప్రాతిపదికన విడిపోయి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో విలీనమైన ప్రాంతాలలో అక్కడి ప్రజలు అధికారికంగా 1948 సెప్టెంబర్ 17వ రోజు స్వాతంత్య్రం లభించిన రోజుగా ఉత్సవాలు […]
Read Full Post »
Posted in సంపాదకీయం, తెలుగు, హైదరాబాద్ విమోచన on సెప్టెంబర్ 17th, 2008
- ఎన్. వేణుగోపాల్
సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందని ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం , భారతీయ జనతా పార్టీ ఈ కట్టు కథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ‘మా వైపు లేకపోతే వాళ్లవైపు ఉన్నట్టే’ అని ప్రపంచాన్ని బెదిరించిన జార్జి బుష్ లాగ ‘దీన్ని విమోచనం అనకపోతే రజాకార్ల వైపు ఉన్నట్టే’ అని బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చిన […]
Read Full Post »
Posted in హైదరాబాద్ విమోచన on నవంబర్ 23rd, 2006
- బి. అనిల్ కుమార్
బ్రిటిష పరిపాలనలో స్వయం ప్రతిపత్తి అనుభవించిన 556 సంస్థానాల్లో అతి పెద్దది, ముఖ్యమైనది హైదరాబాద్ సంస్థానం. కుతుబ్ షాహీల గోలకొండ రాజ్యాన్ని స్వీయ దండయాత్రలో చేజిక్కించుకున్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఒకటవ ఆసఫ్ ఝాను 1713లో డక్కను సుబేదారుగా నియమించాడు. నిజాం ఉల్ముల్క్ అన్న బిరుదును స్వీకరించి మొఘల్ గవర్నర్గా గోలకోండ రాజ్యాన్ని చేపట్టిన ఆసఫ్ఝా ఢిల్లీ పీఠంపై సంక్షోభం నెలకొన్న సమయంలో స్వతంత్ర్యం ప్రకటించుకోవడం ద్వారా 1724లో నిజాం రాజ్యాన్ని స్థాపించాడు.
[…]
Read Full Post »