- బోధనం నర్సిరెడ్డి, ఎలికట్టె శంకర్రావు, గౌస్ మొహియుద్దీన్
‘దారి తప్పుతున్నాం జాగ్రత్త’ అంటూ తెలంగాణా ప్రజలతో మమేకమైనట్టు ఎం.వి.రమణారెడ్డి రాసిన ఉపన్యాస వ్యాసం (ఫిబ్రవరి -వివిధ) ఉత్త వైరుధ్యాలపుట్టగానూ, కోస్తా పక్షపాతంగానూ ఉంది. తిరుపతిలో ఈ ఉపన్యాసం ఎంత దురుద్దేశ్యపూర్వకంగా, పక్షపాత ధోరణితో చేసిందో పత్రికలో రావడం ద్వారా తెలంగాణా ప్రజలకు తెలిసింది. ఇందులోని వైరుధ్యాలను, పక్షపాత వ్యాఖ్యానాలను ఒక్కటొక్కటే సోదాహరణంగా వివరిస్తాం.
Category Archive for 'వివిధ'
అతడిది జిల్లా వరంగల్లు, మండలం మద్దూరు, ఊరు రేబర్తి.
అంటరానింటిలో అంటరానివానిగానే పుట్టాడు.
పాడితే కంఠనాళం తెగి పడాలి. పల్లవితో అంటుకునే అగ్ని కావాలి. అంతిమ చరణం శ్రోతల్లో బడబాగ్ని పుట్టించాలి. తాను జన్మించిన నేల, తన ప్రజలు, తన సాహిత్య కళారంగం పట్ల తనదైన బాధ్యత ఉందని నమ్మే కవి అందెశ్రీ
పోతన పేరు ఎందుకు పెట్టాలంటే
Posted in వివిధ, తెలుగు, తెలంగాణ చరిత్ర on నవంబర్ 26th, 2007
-వేణు సంకోజు, కూరెళ్ళ విఠలాచార్య
నల్లగొండ జిల్లా విశ్వవిద్యాలయానికి - సమస్త తెలంగాణకు, తెలుగుజాతికే గర్వకారణమైన ‘మహాకవి పోతన’ పేరును సూచించడం జరిగింది. అందుకు గల బలవత్తరమైన, సహేతుకమైన కారణమేమంటే, సంస్కర్త హృదయం గల పోతన ‘తొలి విప్లవకవి’ కూడా కావడం.
మహాకవి పోతన పేరు పెట్టుకోవడం ద్వారా మహోన్నత చారిత్రక వారసత్వాన్ని, సాంస్కృతిక వికాసాన్ని గౌరవించుకున్నట్లవుతుంది. ఒక మహత్తర కాలానికి నమస్కరించుకొని, కొద్దిగా రుణంతీర్చుకుంటూ, కృతజ్ఞతను ప్రకటించుకున్నట్లవుతుంది.
తెలంగాణ సాహిత్య చరిత్రలో ఒక ‘అపరిచితుడు’
Posted in వివిధ, తెలుగు, తెలంగాణ వైతాళికులు on జూన్ 12th, 2007
- అఫ్సర్
1944 తెలంగాణ గ్రామాల్లో ఆంధ్రమహాసభ జెండాలు ఉత్తేజంగా ఎగురుతున్నాయి. ప్రతి గ్రామం ఒక నిప్పుల కుంపటిగా మారుతోంది. నెత్తురు మండి, కాసింత ధిక్కారపు గొంతు ఎత్తిన ప్రతి యువకుడి మీదా రాజ్యం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటి ఖమ్మంజిల్లాలోని పిండిప్రోలు అలాంటి ఒక గ్రామం. నిర్బంధాన్ని భరించలేక నిండా రెండు పదులు నిండని ఒక బ్రాహ్మణయువకుడు అరచేతుల్లో ప్రాణాల్ని దాచుకొని భాగ్యనగరం చేరుకున్నా డు భార్యతో. నగరం బతుకు అతనికీ, ఆమెకీ కొత్త. పూటకి ఠికానా లేదు. […]
‘సురవరం’ రచనలకు గ్రహణం వీడేదెన్నడు?
Posted in వివిధ, తెలుగు, గోలకొండ కవుల సంచిక on మే 28th, 2007
- సంగిశెట్టి శ్రీనివాస్
స్మృతిపథం నుంచి చెరిగిపోయిన చరిత్రకు జీవంపోసి, తెలుగువారి ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి, నిరంతర సృజనశీలి, అభ్యుదయవాది సురవరం ప్రతాపరెడ్డి. (మే 28న ఆయన జయంతి). తెలంగాణ పునర్వికాసోద్యమంలో సాహిత్య, సాంస్కృతిక, చారిత్రిక రంగాల్లో పనిచేసిన ఈయన రచనలకు ఇంకా గ్రహణం వీడలేదు. తన సంపాదకత్వంలో 25 యేండ్లు నడిచిన గోలకొండ పత్రిక ప్రతులు కనుమరుగవుతున్నాయి. దానితోపాటే విలువైన తెలంగాణ సాహిత్యం కూడా సమాధి అయ్యే ప్రమాదముంది.



