Feed on
Posts
Comments

Category Archive for 'వివిధ'

పరిష్కారం ఏదైనా ప్రజలే గెలవాలి
రొమాంటిక్‌ రంగు పులమడం అర్థరహితం
సమస్య పట్ల అవగాహనా, భావోద్వేగాలకు లోనుగాకుండా తార్కికంగానూ దూరదృష్టితోనూ పరిష్కారం ఆలోచించగల వివేచనా కనిపించడం లేదు. ‘సమైక్యాంధ్ర’ బోలు నినాదం. ప్రత్యేక తెలంగాణ అంత తేలిగ్గా ఇవ్వరన్న నమ్మకంతో ఇన్నాళ్లూ అందుకు మద్దతు పలికిన రాజకీయ పార్టీలూ, ఉద్యమం జరుగుతున్నన్నాళ్లూ చోద్యం చూస్తూన్న ఇతర ప్రాంత ప్రజలూ ఇప్పుడు సమైక్యాంధ్ర అంటూ గొంతు చించుకోవడం విచిత్రం. Read Completely >>

Read Full Post »

- వెల్దండి శ్రీధర్‌
తెలంగాణ సామాజిక పరిణామాలు, జీవన విధానంపై తెలంగాణ కథకులు ‘ఏం చెప్పిండ్రు? ఏం చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు?’ అన్న అంశంమీద మాట-ముచ్చట ఆగస్టు 9న హైదరాబాద్‌లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో జరిగింది.
ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించిన తెరవే అధ్యక్షులు జూకంటి జగన్నాథం మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యమంటే జన జీవన చిత్రణ కూడా అంటూ 1990 తర్వాత ఆడెపు లక్ష్మీపతి నుంచి పెద్దింటి అశోక్‌ దాకా అనేకులు గ్రామ విధ్వంస ముఖచిత్రాన్ని, వలసలను, ప్రపంచీకరణను […]

Read Full Post »

- ఆచార్య రవ్వా శ్రీహరి
ఆంధ్రులందరూ ఒకేజాతికి చెందినవారైనా ఆంధ్రదేశంలోని ప్రాంతాల భేదాన్నిబట్టి నిజామాంధ్రులు, కోస్తా ఆంధ్రులు, రాయలసీమ ఆంధ్రులు, కళింగాంధ్రులు అనే నాలుగు ప్రధాన భేదాలు కనిపిస్తాయి. నిజామాంధ్రులు నివసించే భూభాగాన్నే మనం ‘తెలంగాణ’ అని వ్యవహరిస్తున్నాం. ఏమి దురదృష్టమో కాని కొన్ని ప్రాంతాల పండితుల్లో, పెద్దల్లో తెలంగాణంలో తెలుగు లేదనీ, ఉన్నా అది సరైన తెలుగు కాదనీ నిష్కారణమైన అసత్యమైన అపోహ నేటికీ ఉంది. ఈ అపోహ కలిగిన వారు తెలంగాణంలోని మారుమూల పల్లెలకు వెళ్లితే […]

Read Full Post »

- స్కైబాబ

గ్లోబలైజేషన్‌.. నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు… ఇవన్నీ ప్రజలకు చెడు చేస్తున్నయని చెప్పుకు తిరిగే ఒక వర్గం తయారై ఉంది. గబుక్కున ఈ ఫలితాలన్ని అందుకునే వాళ్ళలో ఈ వర్గం ముందే ఉంటుంది. అన్ని అనుబవిస్తది. పొరపాటునో లేక వేరే కారణాలవల్లో ఏవో కొందరికి అలాంటి మంచి జరిగితేనో ఇది ఈ విధంగా జరగటానికి వీల్లేదు. ఇది మీకు చాలా చెడు చేస్తదని వాళ్ళున్న స్థితిని, స్థాయిని పట్టించుకోకుండా వీళ్లుచెప్పబోతుంటరు వాళ్లకు.

[…]

Read Full Post »

- గోరటి వెంకన్న

కంప కుంపటోలె కమ్మి అలుపె
కాసింత కునుకుతో బలెహాయి గొలిపె
సోయిలేని హాయి సూడసక్కని రేయి
విని కనిపించని వింతగొంతుల జోలి

Read Full Post »

- పసునూరి రవీందర్‌

ఉద్యమాల పురుటిగడ్డ మీద కథాసాహిత్య ప్రక్రియను మరింత విస్తరించేందుకు తెలంగాణ నవ కథకుల ఆధ్వర్యంలో తెలంగాణ కథా వేదిక ‘దస్కత్‌’ ఆవిర్భవించింది. తెలంగాణ నేలమీద జరిగిన, జరుగుతున్న పోరాటాల్లో సాహిత్యం తనవంతు పాత్రను క్రియాశీలకంగా పోషించింది. అక్షరాలు దారి చూపే వెలుగు దీపాలైనయ్‌. ఈ క్రమంలో జీవితాన్ని సమగ్రంగా ప్రతిబింబించే కథా ప్రక్రియను మరింత విస్తరించాల్సిన అవసరాన్ని ఈ ప్రాంత నవతరం గుర్తించింది.

Read Full Post »

- బి. రామానాయుడు, లండన్‌

ఇంగ్లండ్‌లో తెలుగువారి అస్తిత్వానికి సాహిత్యరంగంలో ప్రతీకగా ఆవిర్భవించిన మాచెర్ల హేమ వరంగల్‌ జిల్లా ఆత్మకూర్‌ గ్రామానికి చెందినవారు. రిచర్డ్ అండ్‌ జూడీ అనే జంట నిర్వహించిన (2007) నవలల పోటీలో పాల్గొన్న 44,000 ఎంట్రీలలో వడపోయగా మిగిలిన 26 నవలలలో హేమ ‘బ్రీజ్‌ ఫ్రమ్‌ ది రివర్‌ మంజీర‘ ఒకటిగా నిలిచింది.

Read Full Post »

- లోచన్‌
ఎంతైనా నువ్వు గ్రేట్‌
నీ విజన్‌ గ్రేట్‌
హైద్రాబాద్‌ చుట్టూ అల్లుకున్న నీ అభిమానం గ్రేట్‌

Read Full Post »

- ఎస్‌. జగన్‌రెడ్డి

అలనాడు సాహిత్యకారులను గౌరవించడం హైదరాబాద్‌ రాజ్యంలో ఒక సామాజిక విలువగా చెలామణి అయ్యేది. రాజులు, కులీనవర్గాలే కాదు సామాన్యులు కూడా కళాప్రియులు, కవిత్వ పిపాసులే. రాజులు సంగీత, సాహిత్యకారులు కావడం చరిత్రలో ఉన్నదే. ఆసఫ్‌ జాహీల వంశంలో ఐదుగురు రాజకవులు ఉర్దూ సాహిత్యంలో పేరెన్నికగనడం విశేషం…

Read Full Post »

పండిన గోరింట చేతులే కన్నీళ్లు తుడిచె
మంటలే మండించ కనుల నిప్పు రాజేసె

* * *
అద్దిన రంగులతో అద్దమ రాతిరి వోలె నీ రూపు
కొత్త కొత్త తారకలన్నీ రాలె ధరాతలం వైపు

Read Full Post »

కవులు, రచయితలుగానే పరిచయమున్న ఎందరో ప్రముఖులు చట్టసభల్లోనూ అడుగుపెట్టారు. మంత్రులూ ముఖ్యమంత్రులూ ప్రధానమంత్రీ అయ్యారు. వారిలో చాలామంది సాహిత్యకారుల్లాగే పేదరికాన్ని అనుభవించినవారే. రేఖామాత్రంగా ఆ వివరాలు తెలిపే రెండు వ్యాసాలివి..
తెలంగాణ..
- సంగిశెట్టి శ్రీనివాస్‌
తెలుగు సాహిత్య చరిత్రలో ‘గోలకొండ కవుల సంచిక’కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ‘తెలంగాణ’లో కవులు లేరనే విమర్శకు సమాధానంగా రోషంతో సురవరం ప్రతాపరెడ్డి ఈ సంచికను వెలువరించారు. ఇందులో బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, అరిగె రామస్వామి ముగ్గురూ 1952లో జరిగిన తొలి […]

Read Full Post »

- కోయి కోటేశ్వరరావు
కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో బోధించే తెలుగు సాహిత్యానికి సంబంధించిన కొన్ని పాఠ్యాంశాలు విద్యార్థుల బౌద్ధిక చైతన్యాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఉన్నాయి. విజ్ఞానశాస్త్రం, అర్థ శాస్త్రం, సామాజిక శాస్త్రం తదితర విభాగాల్లోని పాఠ్య ప్రణాళికల్లో కాలానుగుణంగా నిర్మాణాత్మక మార్పులు చోటుచేసుకున్నప్పటికీ తెలుగు సాహిత్య పాఠ్యాంశాలు శుద్ధ సంప్రదాయ పద్ధతిలోనే ఇంకా కొనసాగటం చిత్రం.

Read Full Post »

- గుండెబోయిన శ్రీనివాస్‌

ఎవరినెక్కడ పెట్టవలనో
ఎవరి పని ఇక పట్టవలెనో
నీళ్లు నములుడు మానుకొని
జర.. నిర్ణయిద్దామా !

Read Full Post »

- జూకంటి జగన్నాథం

కావాల్నని తంతే
తంతెకైనా కోపం వస్తది
రేషం పుట్టువడి
పాప దోషమే పెట్టుబడి

Read Full Post »

- జిందం అశోక్‌

తెలంగాణ అంటే
అందరికి బతుకమ్మ పాట
బతుకమ్మ ఆటైనది-
ఒకడు పాడిన పాట

Read Full Post »

- పెద్దింటి అశోక్‌కుమార్‌
మార్చి 14, 15తేదీలలో 13మంది కథకులతో మిడ్‌మానేరు ముంపుగ్రామాల సందర్శనను చేపట్టింది తెలంగాణ రచయితల వేదిక. శ్రీరాంసాగర్‌ వరద కాలువ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్‌ జిల్లా మానేరు నదిపై కడుతున్న చెక్‌ డ్యాం కింద 18 ఊర్లు మునిగిపోనున్నాయి. దాదాపు లక్షమంది నిర్వాసితులవబోతున్నారు. బాధిత ప్రజలకు నష్టపరిహారాల్లేవు.. పునరావాసాల్లేవు.. వారి దీన గాధలు విని తల్లడిల్లిన రచయితల మనసు ఘోష ఇది…

Read Full Post »

‘ఈత గురించి ఎన్ని పుస్తకాలు చదివినా ఈత రాదు. ఈత రావాలంటే నీళ్లలోకి దిగాల్సిందే. అట్లాగే కథ గురించి ఎన్ని ఉపన్యాసాలు విన్నా, ఎన్ని పుస్తకాలు చదివినా కథ రాయడం రాదు. కథ రాసి చర్చిస్తేనే అది సరిగ్గా అర్థమవుతుంది’ అన్నారు అల్లం రాజయ్య కథా వర్క్‌షాపుల ఉద్దేశాన్ని వివరిస్తూ.

Read Full Post »

- పి.వరలక్ష్మి
‘ఈత గురించి ఎన్ని పుస్తకాలు చదివినా ఈత రాదు. ఈత రావాలంటే నీళ్లలోకి దిగాల్సిందే. అట్లాగే కథ గురించి ఎన్ని ఉపన్యాసాలు విన్నా, ఎన్ని పుస్తకాలు చదివినా కథ రాయడం రాదు. కథ రాసి చర్చిస్తేనే అది సరిగ్గా అర్థమవుతుంది’ అన్నారు అల్లం రాజయ్య కథా వర్క్‌షాపుల ఉద్దేశాన్ని వివరిస్తూ. సరిగ్గా ఇదే పని చేస్తూ వస్తున్నది విరసం. 2007 నుండి ప్రతి మూన్నెళ్లకోసారి కథకుల సమావేశాలను రూపకల్పన చేసి ఇప్పటికీ అమరావతి, అనంతపురం, షాద్‌ […]

Read Full Post »

- గద్దర్‌

వీరులార - మీకు జోహార్లు…
పారె నెత్తుటి పోరుల జోహార్లు..
విద్యార్థులార జోహార్లు…
వీరులారా

Read Full Post »

- ఇనుకొండ తిరుమలి
ముస్లింలు, తెలుగువారి సంబంధ బాంధవ్యాలు, వాటి చారిత్రక పరిణామాలను నిష్పాక్షిక వైఖరితో అర్థం చేసుకోవల్సిన సమయమాసన్నమయింది. హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమవడంతో సకల ప్రాభవాలను కోల్పోయిన మన రాష్ట్ర ముస్లింలలో ఇటీవలి కాలంలో పెంపొందుతున్న రాజకీయ ఆలోచనల దృష్ట్యా ఈ పునః పరిశీలన ఎంతైనా అవసరం. ముస్లింలు ఒక మత సమూహంగా, పాలకులుగా ఐదు శతాబ్దాల పాటు దక్క న్‌/ హైదరాబాద్‌ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్నారు.

Read Full Post »

Older Posts »

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com