Feed on
Posts
Comments

Category Archive for 'తెలంగాణ చరిత్ర'

ఎన్కట వ్యావహారిక భాష పేరుతో కోస్తాంధ్ర భాషను రుద్ది మా భాషను మంటగల్పిండ్రు. ఇప్పుడు ‘తెలుగు’ వైభవ ప్రాభవాల పేరుతో మా ప్రాంత అస్తిత్వాన్నే నాశనం చేయచూస్తుండ్రు. నవంబరు 15 నుంచి డిసెంబరు 15 వరకు హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో జరిగే భాషా ‘ఉత్సవా’ల్లో, తొలి అచ్చ తెలుగు కావ్యాన్ని అందించిన తెలంగాణను అణచివేయచూస్తుండ్రు. తెలంగాణ అన్నప్పుడల్లా దాన్ని మరుగున పరచడానికి తెలుగు పేరుతో పన్నాగం పన్నిండ్రు. ఆఖరికి తెలుగు భాషకు ప్రాచీనతను సాధించడానికి తెలంగాణలోని తెలుగు […]

Read Full Post »

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17, 2008 : భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్న రాజ్యం హైదరాబాద్‌ సంస్థానం. నిజాం రాజుల పాలన కింద ఉన్న ఆ రాజ్యాన్ని నాటి భారత పాలకులు సైనిక చర్య ద్వారా 1948లో ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేసుకున్నారు. సెప్టెంబర్‌ 17న ఈ సంఘటన జరిగింది. ఐదు రోజులు… వంద గంటల్లో సైనిక చర్య ముగిసింది.

Read Full Post »

Three men, all clad in dhotis, entered the Bapu Kuti. The oldest of the three stood sharply erect. His movements were slow and graceful. Adjusting the angvastra on his shoulder the man wandered about, quietly taking in the furniture-free spaces of the Kuti. One of the younger men bounded about excitedly exclaiming and admiring tiny […]

Read Full Post »

Preview this book

By Puccalapalli
Sundarayya

Published 2006
Foundation Books

472 pages

ISBN:8175963166

Add to my library

Write review

Courtesy : Google Books
 Also read Dileeps తెలంగాణా సాయుధ పోరాటం - ప్రశ్న-జవాబు

Read Full Post »

- అల్లం నారాయణ
జమ్మిచెట్టు మీద ఆయుధాలు దించుకో… నువ్వు ఎన్నో వాడివి. దసరనాడు పాలపిట్టకోసం చూసినట్టు తెలంగాణ కోసం ఎన్నినాళ్లు చూడమంటవ్‌. నిజమే. దేవేందర్‌ గౌడ్‌ సాబ్‌. ఆత్మాభిమానం దెబ్బతిన్నది. ఒకటా రెండా యాభై ఏళ్లయింది. కలిపినప్పుడే విచ్చుకుపోయింది తెలంగాణ ఆత్మ. పచ్చికుండ ఫటిల్లున పగిలిపోయినట్టు. కానీ.. తెలంగాణ మాత్రం రాలేదు.

Read Full Post »

- కట్టా శేఖర్‌ రెడ్డి
ఇప్పుడు తెలంగాణను తెచ్చుకున్నా అది దొరలపాలవుతుంది. బడుగులకు రాజ్యాధికారం దక్కదు. వై.ఎస్‌. నేతృత్వంలో పూర్తిస్థాయి అభివృద్ధి జరిగాక ప్రత్యే క రాష్ట్ర అంశం తెరపైకి రావాలి. ప్రస్తుత తరుణంలో ప్రత్యేక రాష్ట్రం కంటే అభి వృద్ధే ముఖ్యం.
-తెలంగాణ డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీలు
‘ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయితే కోస్తాంధ్రుల పెత్తనం ఎక్కువయి పోతుంది. వారితో నెగ్గలేం. మాకు ప్రత్యేక రాష్ట్రం వద్దు. మద్రాసు రాష్ట్రం లోనే కొనసాగుతాం’- ఇది అప్పట్లో ఆంధ్ర రాష్ట్ర ఉద్య మానికి […]

Read Full Post »

1857 తిరుగుబాటులో హైద్రాబాద్‌ పాత్రను లోకానికి చాటాలన్న కోరికతో, ఆ అమరవీరులను స్మరించుకోవాలన్న ఆశతో, ఈ తరం వారికి ఆ అమరులను పరిచయం చేయాలన్న సంకల్పంతో ఈ కథల పుస్తకాన్ని మీ ముందుకు తెస్తున్నాను.
1857కు ఈ ఏడు 150 ఏండ్లు నిండాయి. అయినా ఆ పోరాటం ఇంకా కొనసాగుతున్నట్లే అనిపిస్తుంది. నేల తల్లి విముక్తి పోరాటం నుండి అనేకానేక అంతర్గత, బాహ్య నయావలసవాద వ్యతిరేక పోరాటాల వరకు, పోరాట రూపం మారిందేమో గాని ‘సారం’, ”అంతస్సూత్రం” మాత్రం […]

Read Full Post »

-వేణు సంకోజు, కూరెళ్ళ విఠలాచార్య
నల్లగొండ జిల్లా విశ్వవిద్యాలయానికి - సమస్త తెలంగాణకు, తెలుగుజాతికే గర్వకారణమైన ‘మహాకవి పోతన’ పేరును సూచించడం జరిగింది. అందుకు గల బలవత్తరమైన, సహేతుకమైన కారణమేమంటే, సంస్కర్త హృదయం గల పోతన ‘తొలి విప్లవకవి’ కూడా కావడం.
మహాకవి పోతన పేరు పెట్టుకోవడం ద్వారా మహోన్నత చారిత్రక వారసత్వాన్ని, సాంస్కృతిక వికాసాన్ని గౌరవించుకున్నట్లవుతుంది. ఒక మహత్తర కాలానికి నమస్కరించుకొని, కొద్దిగా రుణంతీర్చుకుంటూ, కృతజ్ఞతను ప్రకటించుకున్నట్లవుతుంది.

Read Full Post »


Read Full Post »

- సంగిశెట్టి శ్రీనివాస్‌
శుక్రవారం,హైదరాబాద్‌ మక్కామసీదు, జులై17, 1857
మసీదులోపలా, బయటా కిక్కిరిసిన జనం.
పర్వదినాల్లో తప్ప మామూలు ప్రార్థన సమయంలో అన్ని వేల మంది ముస్లిములు అక్కడికి రారు. కలవరం, ఆవేశం, ఆగ్రహం వారిని నిలవనీయడంలేదు. ఒకపక్క పెద్ద పెద్దగా నినాదాలు వినిపిస్తున్నాయి. మరొకపక్క తీవ్రంగా తర్జనభర్జన పడుతూ చేస్తున్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఆ రోజేదో జరగబోతోంది!

Read Full Post »

Dear friends and well-wishers’ of Telangana,
DT [Discover Telangana] is proud to present the inaugural issue of “Telugu Gadda” a Telangana weekly started on Deepavali of 1969 (9 November 1969). By Late Mamidi Ramakantha Rao, He was editor and publisher for this weekly.

Read Full Post »

09 నవంబర్ 1969ల దీపావళి సందర్భంగ, మామిడి రమాకాంత్ రావు గారు మొదలుపెట్టిన ‘తెలుగు గడ్డ’ తెలంగాణ వార పత్రిక, మొదటి సంచిక.

   

Read Full Post »

09 నవంబర్ 1969ల దీపావళి సందర్భంగ, మామిడి రమాకాంత్ రావు గారు మొదలుపెట్టిన ‘తెలుగు గడ్డ’ తెలంగాణ వార పత్రిక, రెండో సంచిక 16 నవంబర్ 1969.
 
   

Read Full Post »

- కె. శ్రీనివాస్‌
జూన్‌ 21, 2007 నాటి ‘శ్రీకాలమ్‌’లోని అభిప్రాయాలూ వ్యాఖ్యలపై కంటె, అందులో ఆయన ప్రస్తావించిన చరిత్రాంశాల గురించి చర్చించడమే ఈ లేఖావ్యాసం ఉద్దేశం. ఉద్యమంలో దిగడానికి ముందు కెసిఆర్‌ తెలంగాణ హద్దుల గురించి, చరిత్రగురించి,పేర్ల గురించి తెలుసుకుని ఉండవలసిందని శ్రీరమణగారు అన్నారు. చాలా మంచి సలహా. కెసిఆర్‌కు నిజంగానే కొన్ని వివరాలు తెలియదు. ఉదాహరణకు క్వీన్‌ ఎలిజెబెత్‌ ఎన్నడూ హైదరాబాద్‌ రాలేదు. ప్రిన్స్‌ వేల్స్‌, లార్డ్‌ కర్జన్‌ వంటివారు వచ్చారు. వలసవచ్చినవారు తొలిరోజుల్లో చెప్పులతోవచ్చారా, […]

Read Full Post »

మనవి
ఆహ్వానం - తడకమళ్ళ వివేక్‌
తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట చరిత్ర వక్రీకరణ - కె. జితేంద్రబాబు
తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణం ఆవశ్యకత- కొన్ని తక్షణ కర్తవ్యాలు - పరవస్తు లోకేశ్వర్
తెలంగాణ చరిత్ర రచనకు కొన్ని సూచనలు - డా. మలయశ్రీ
చరిత్ర రచన / నిర్మాణం - డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి
తెలంగాణ చరిత్రలోనైనా ముస్లింలకు న్యాయం జరగాలి - స్కైబాబ

Read Full Post »

- ఎన్.వేణుగోపాల్
ఒక ప్రాంతీయ ఉద్యమం వికసించేటప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన చరిత్ర పట్ల ప్రగాఢమైన శ్రద్ధాసక్తులు వ్యక్తం కావడం, చరిత్రను తవ్వితీసి తమ అస్తిత్వపు ప్రత్యేకతకు ఆధారాలను, సమర్థనలను వెతుక్కోవడం, చరిత్ర పునాదిపైననే తమ ఉద్యమానికి మద్దతునూ, సాధికారతనూ సాధించుకోవడానికి ప్రయత్నించడం సహజమైన అంశాలు. అయితే చరిత్ర అనేది ఒక నిరపేక్షమైన ముద్ద కాదు గనుక, అందులో వ్యాఖ్యాత దృక్పథాన్నిబట్టి, ఇష్టాయిష్టాలనుబట్టి వాస్తవాల ఎంపికకూ, విస్మరణకూ, వక్రీకరణకూ అవకాశం ఉంటుంది గనుక, తీవ్రమైన భావోద్వేగాలు నెలకొని ఉన్నసమయంలో […]

Read Full Post »

… చావూష్‌ల గురించి ప్రత్యేకంగనే చెప్పుకోవాలె. వీళ్ళందరూ అఫ్రికాకు సంబంధించిన ముస్లింలు. వీరు ప్రధానంగ రెండు దేశాలకు ఎమెన్, అబిసీనియాలకు చెందినవాళ్ళు. అబిసీనియా కొత్త పేరు ఇథియోపియా. అబిసీనియా వాళ్ళను ‘హబ్సీ’లు అని కూడ అంటరు. నగరంలోని హబ్సిగుడా వీళ్ళకు సంబంధించినదే. వీళ్ళను చూడంగనే నీగ్రోలని సులభంగ గుర్తించవచ్చు. ఈ హబ్సీలు అనగా చావూష్‌లు హైద్రాబాద్ నగరానికి చేరుకున్న వైనం ఒక ఇతిహాస గాథ.

Read Full Post »

నల్గొండ జిల్లా, జనగామ తాలూకాకు (ప్రస్తుతం జనగామ తాలూకా వరంగల్లు జిల్లాలో ఉంది) చెందిన పేరు మోసిన దేశముఖ్ విసునూరు రామచంద్రారెడ్డి 40 వేల ఎకరాలకు భూస్వామి. ఆయన కౌలుదార్లనుండి, రైతుల నుండి నిర్బంధంగా భూములు కబళిస్తూనే వచ్చాడు. తన ఆధీన ప్రాంతంలోని, దాదాపు 40 గ్రామాల రైతులచేత నిర్బంధంగా సంవత్సరం పొడవునా తన పొలాలలో చాకిరి చేయించుకొనేవాడు. కుటుంబంలో బిడ్డ పుట్టినా, వివాహం జరిగినా, ఎవరైనా మరణించినా ఆ సందర్భాలలో రైతులనుండి నిర్బంధంగా నజరానాలు (ధనరూపంగాగాని, […]

Read Full Post »

- Source mongabay.com
India - Regionalism
The formation of states along linguistic and ethnic lines has occurred in India in numerous instances since independence in 1947 (see Linguistic States, this ch.). There have been demands, however, to form units within states based not only along linguistic, ethnic, and religious lines but also, in some cases, on a […]

Read Full Post »