Posted in తెలంగాణ ప్రాజెక్టుల, సంపాదకీయం, తెలుగు on మార్చ్ 15th, 2008
- అల్లం నారాయణ
ఏటా కోటీ ఇరవైలక్షల మంది నీ గులాబీతోటను తొక్కుకుంటూ తోసుకుంటూ ఎగిరిపోతారిక లోహవిహంగాల రెక్కలపైన. నీ ఎకరం గులాబీ తోట పక్కవాళ్ళ వందలాది ఎకరాల చేనుచెలక, ఆ పక్కవాళ్ళ కూరగాయల మళ్ళను మాయం చేసి నాలుగున్నర కిలోమీటర్ల పెట్టున వేసినారు చూడు… అది రన్వే. అతి పొడవైనది. అదొక కొండచిలువకూడా. దానికడుపులో దాగున్న నీ గులాబీతోట, వేల ఎకరాల తోటలు వాడిపోయినయ్. ఆవుల చంద్రమ్మా, సుభద్ర, రాజవ్వ, మల్లవ్వ, రాజపోషవ్వ పేరేదైతేనేం భూమి పుత్రికా.
Read Full Post »
Posted in తెలంగాణ ప్రాజెక్టుల, సంపాదకీయం, తెలుగు on ఫిబ్రవరి 13th, 2008
- టి. శివాజీరావు
రాష్ట్రాభివృద్ధిలో భాగంగా భారీ వ్యయంతో నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు ప్రారంభం నుండీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. వ్యవసాయం, విద్యుదుత్పత్తి, త్రాగునీరు, పారిశ్రామికాభివృద్ధే పోలవరం ప్రాజె క్టు ముఖ్యోద్దేశమని గత అరవై ఏళ్ళుగా ప్రభుత్వం చబుతూనే ఉంది. ఈ ప్రాజెక్టు ను బ్యారేజిగా నిర్మించి దాదాపు 100 శతకోటి ఘనపుటడుగుల గోదావరి నీటిని కృష్ణానదిలోకి విజయవాడ వద్ద కలిసేటట్లు చేయవచ్చని ప్రఖ్యాత ఇంజనీర్లు ఎఎన్ ఖోస్లా 1953లోను, గుల్హటి 1963లోను కేంద్ర ప్రభుత్వానికి […]
Read Full Post »
Posted in తెలంగాణ ప్రాజెక్టుల, తెలుగు, వీడియో on జనవరి 26th, 2008
Posted in తెలంగాణ ప్రాజెక్టుల, తెలుగు, వ్యాసాలు on నవంబర్ 25th, 2007
- యం. కోదండరాం, కె. సీతారాంరావు
I
1956లో సమైక్యాంధ్ర రాష్ట్రం ఎర్పడ్డ తర్వాత సాగునీటిరంగంలో తెలంగాణా జల వనరులు సమగ్ర దోపిడికిలోనైనాయి. గత ఐదు దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు సాగునీటి రంగంలో అవలంభించిన వివక్షాపూరితమైన విధానాల ఫలితమే తెలంగాణాలో నేటి వ్యవసాయ సంక్షోభం. తెలంగాణా జల వనరుల చౌర్యానికవసరమైన వివక్షాపూరిత విధానాల రూపకల్పన, పథక రచన సమైక్యాంధ్ర రాష్ట్రంలో నిరంతరంగా కొనసాగుతునే ఉన్నది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ”జలయజ్ఞం” దానిలోని ప్రధాన పథకాలైన పోలవరం, […]
Read Full Post »
తెలంగాణకు సాగునీరు, తాగునీరు, పరిశ్రమల అవసరాలు తీరుస్తోన్న శ్రీరాంసాగర్, బాబ్లీ ప్రాజెక్ట్ వల్ల 18 లక్షల ఎకరాల ఆయట్టు ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందంటున్న రఘువీర్
తెలంగాణ ప్రాంతానికి తీవ్ర నష్టం తెచ్చేవి ప్రస్తుతం అతి వేగంగా నిర్మితమవుతున్న బాబ్లీ, పోతిరెడ్డి ప్రాజెక్టులేనని రాజకీయ నేతలు, ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. బాబ్లీ ప్రాజెక్ట్ మహారాష్ట్రకు లాభం చేకూరిస్తే, పోతిరెడ్డిపాడు కడపకు లబ్ది చేకూరుస్తుంది. ఆయా ప్రాంతా లకు లబ్ది చేకూర్చే క్రమంలో తెలంగాణ ప్రాంతానికి తీవ్ర నష్టం తేనున్నాయి. […]
Read Full Post »